రేవంత్కి మూడోసారి రిమాండ్ పొడిగింపు
ఓటుకు నోటు కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ చర్లపల్లి జైలులో ఉన్న రేవంత్ రెడ్డికి జూలై 13 వరకు రిమాండు పొడిగిస్తూ అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) తీర్పు చెప్పింది. వాస్తవానికి జూన్ 1వ తేదీని అరెస్టయిన రేవంత్కు ఇప్పటికి రెండుసార్లు రిమాండు పొడిగించారు. ఈరోజుతో రెండోసారి రిమాండు గడువు కూడా ముగియడంతో ఆయనను ఆయనతోపాటు సహనిందితులు సెబాస్టియన్ను, ఉదయసింహ ఏసీబీ కోర్టు ముందు హాజరు పరిచారు. విచారణ ఇంకా కొనసాగుతున్నందున వీరి రిమాండును పొడిగించాల్సిందిగా కోరుతూ ఏసీబీ అధికారులు […]
BY sarvi29 Jun 2015 1:50 AM GMT
X
sarvi Updated On: 29 Jun 2015 1:50 AM GMT
ఓటుకు నోటు కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ చర్లపల్లి జైలులో ఉన్న రేవంత్ రెడ్డికి జూలై 13 వరకు రిమాండు పొడిగిస్తూ అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) తీర్పు చెప్పింది. వాస్తవానికి జూన్ 1వ తేదీని అరెస్టయిన రేవంత్కు ఇప్పటికి రెండుసార్లు రిమాండు పొడిగించారు. ఈరోజుతో రెండోసారి రిమాండు గడువు కూడా ముగియడంతో ఆయనను ఆయనతోపాటు సహనిందితులు సెబాస్టియన్ను, ఉదయసింహ ఏసీబీ కోర్టు ముందు హాజరు పరిచారు. విచారణ ఇంకా కొనసాగుతున్నందున వీరి రిమాండును పొడిగించాల్సిందిగా కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టుకు మెమో దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి మరో 14 రోజులపాటు రిమాండు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Next Story