Telugu Global
Others

వైఎస్ ది  ప్ర‌జా ప్ర‌భుత్వం

దివంగ‌త ముఖ్య‌మంత్రి డా.రాజ‌శేఖ‌ర్‌రెడ్డిది ప్ర‌జ‌ల ప్ర‌భుత్వ‌మ‌ని మాజీ కేంద్రమంత్రి బ‌ల‌రాం నాయ‌క్ అన్నారు. వైఎస్‌ హ‌యాంలో అట‌వీ భూములు సాగు చేస్తున్న గిరిజ‌నులు, ప్ర‌భుత్వ భూముల్లో సాగు చేస్తున్న రైతుల‌కు క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ చేసి ప‌ట్టాలు పంచార‌ని  బ‌ల‌రాం నాయ‌క్ గుర్తు చేశారు. వైఎస్ ప్ర‌జా ప్ర‌భుత్వాన్ని న‌డిపితే, కేసీఆర్ క‌క్ష సాధింపు ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. స‌హ‌కార శాఖ భూమిలో కాంగ్రెస్ నేత అక్ర‌మంగా ఇళ్లు నిర్మించాడ‌ని ఆరోపిస్తూ గిరిజ‌నుడి ఇంటిని  అధికారులు వాటిని కూల్చి […]

దివంగ‌త ముఖ్య‌మంత్రి డా.రాజ‌శేఖ‌ర్‌రెడ్డిది ప్ర‌జ‌ల ప్ర‌భుత్వ‌మ‌ని మాజీ కేంద్రమంత్రి బ‌ల‌రాం నాయ‌క్ అన్నారు. వైఎస్‌ హ‌యాంలో అట‌వీ భూములు సాగు చేస్తున్న గిరిజ‌నులు, ప్ర‌భుత్వ భూముల్లో సాగు చేస్తున్న రైతుల‌కు క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ చేసి ప‌ట్టాలు పంచార‌ని బ‌ల‌రాం నాయ‌క్ గుర్తు చేశారు. వైఎస్ ప్ర‌జా ప్ర‌భుత్వాన్ని న‌డిపితే, కేసీఆర్ క‌క్ష సాధింపు ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. స‌హ‌కార శాఖ భూమిలో కాంగ్రెస్ నేత అక్ర‌మంగా ఇళ్లు నిర్మించాడ‌ని ఆరోపిస్తూ గిరిజ‌నుడి ఇంటిని అధికారులు వాటిని కూల్చి వేయ‌డం దుర్మార్గ‌మ‌ని ఆయ‌న అన్నారు. గిరిజ‌న‌శాఖ మంత్రి నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలోనే ఓ గిరిజ‌నుడికి అన్యాయం జ‌ర‌గ‌డం శోచ‌నీయ‌మ‌ని ఆయ‌న అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో విడుద‌ల చేసిన నిధుల‌తో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం సోకు చేసుకుంటోంద‌ని ఆయ‌న అన్నారు. పైగా ఆ నిధులు తామే తెచ్చామ‌ని చెప్పుకోవ‌డం సిగ్గుచేట‌ని బ‌ల‌రాంనాయ‌క్ అన్నారు.

First Published:  28 Jun 2015 1:21 PM GMT
Next Story