Telugu Global
NEWS

సైన్యాన్ని అవ‌మానించిన‌ ఎంపీపై చంద్రబాబు ఫైర్‌

బాధ్యతాయుత పదవిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన‌ ఎంపీ దేశ రక్షణకు ప్రాణాలొడ్డి పోరాడే సైనికులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఫ్రీ ఫుడ్…ఫ్రీ డ్రింక్… ఫ్రీ హాలిడేస్’’ అంటూ జవాన్లను కించపరిచేలా ఒక జాతీయ చానల్ చర్చావేదికలో అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు 24 గంటల్లో రాతపూర్వక వివరణ ఇవ్వాలని స‌ద‌రు ఎంపీని ఆదేశించారు. ఎంపీ రవీంద్రబాబు […]

సైన్యాన్ని అవ‌మానించిన‌ ఎంపీపై చంద్రబాబు ఫైర్‌
X

బాధ్యతాయుత పదవిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన‌ ఎంపీ దేశ రక్షణకు ప్రాణాలొడ్డి పోరాడే సైనికులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఫ్రీ ఫుడ్…ఫ్రీ డ్రింక్… ఫ్రీ హాలిడేస్’’ అంటూ జవాన్లను కించపరిచేలా ఒక జాతీయ చానల్ చర్చావేదికలో అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు 24 గంటల్లో రాతపూర్వక వివరణ ఇవ్వాలని స‌ద‌రు ఎంపీని ఆదేశించారు. ఎంపీ రవీంద్రబాబు వ్యాఖ్యలతో పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని చంద్రబాబు అన్నారు. దేశం కోసం సైనికులు ఎంతో త్యాగం చేస్తున్నారని, సైనికుల పట్ల టీడీపీకి ఎనలేని గౌరవం ఉందని చంద్రబాబు వివ‌ర‌ణ ఇచ్చారు. ఎంపీ ఇచ్చే వివ‌ర‌ణ సంతృప్తిక‌రంగా లేక‌పోతే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.

First Published:  30 Jun 2015 9:53 AM GMT
Next Story