Telugu Global
Others

రాజమండ్రిలో పురోహితుల రిలే నిరాహార దీక్ష

గోదావ‌రి పుష్క‌ర కార్య‌క్ర‌మాల్లో భాగంగా నిర్వ‌హించే విధుల్లో త‌మ‌పై ఆంక్ష‌లు విధించ‌డం స‌రికాద‌ని పురోహితుల సంఘం భావిస్తోంది. ఈ పుష్క‌రాల్లో భాగంగా ప్రతీ ఘాట్‌లోనూ విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ పురోహితుల సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రిలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ విషయంపై గతంలో అధికారులతో చర్చలు జరిపినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వారు ఆరోపించారు. పైగా పిండ ప్ర‌దానాల కోసం ప్ర‌త్యేక ఘాట్‌లు ఏర్పాటు చేస్తున్నార‌ని, అయితే ఈ విష‌యం త‌మ‌కు […]

గోదావ‌రి పుష్క‌ర కార్య‌క్ర‌మాల్లో భాగంగా నిర్వ‌హించే విధుల్లో త‌మ‌పై ఆంక్ష‌లు విధించ‌డం స‌రికాద‌ని పురోహితుల సంఘం భావిస్తోంది. ఈ పుష్క‌రాల్లో భాగంగా ప్రతీ ఘాట్‌లోనూ విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ పురోహితుల సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రిలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ విషయంపై గతంలో అధికారులతో చర్చలు జరిపినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వారు ఆరోపించారు. పైగా పిండ ప్ర‌దానాల కోసం ప్ర‌త్యేక ఘాట్‌లు ఏర్పాటు చేస్తున్నార‌ని, అయితే ఈ విష‌యం త‌మ‌కు మాట మాత్రంగానైనా చెప్ప‌లేద‌ని వారు ఆరోపిస్తున్నారు. పురోహితుల‌కు స‌క్ర‌మంగా విధులు నిర్వ‌హించుకునే స్వేచ్ఛ లేక‌పోతే ఎలా అని వారు ప్ర‌శ్నిస్తున్నారు.
First Published:  1 July 2015 1:15 PM GMT
Next Story