Telugu Global
Others

12 వ‌ర‌కు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

భారత సైన్యంలో చేరేందుకు రిక్రూట్‌మెంట్ జ‌రుగుతోంది. విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సైనిక నియామ‌కాలు జ‌రుపుతున్నారు. ఈ ప్రాంతంలో ఏడు జిల్లాల అభ్యర్థులకు ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి టోకెన్లు జారీ చేస్తారు. టోకెన్లు తీసుకున్న అభ్యర్థులకు మాత్రమే ఈ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి అనుమతించనున్నారు. శుక్రవారం విశాఖ, అనకాపల్లి డివిజన్‌ అభ్యర్థులకు ఎంపిక నిర్వహిస్తారు. ఈ నెల 4న నర్సీపట్నం, పాడేరు ప్రాంత నిరుద్యోగులకు, 5న […]

భారత సైన్యంలో చేరేందుకు రిక్రూట్‌మెంట్ జ‌రుగుతోంది. విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సైనిక నియామ‌కాలు జ‌రుపుతున్నారు. ఈ ప్రాంతంలో ఏడు జిల్లాల అభ్యర్థులకు ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి టోకెన్లు జారీ చేస్తారు. టోకెన్లు తీసుకున్న అభ్యర్థులకు మాత్రమే ఈ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి అనుమతించనున్నారు. శుక్రవారం విశాఖ, అనకాపల్లి డివిజన్‌ అభ్యర్థులకు ఎంపిక నిర్వహిస్తారు. ఈ నెల 4న నర్సీపట్నం, పాడేరు ప్రాంత నిరుద్యోగులకు, 5న శ్రీకాకుళం సబ్‌డివిజన్‌, 6న టెక్కలి, 7న పాలకొండ, 8న విజయనగరం సబ్‌డివిజన్‌లకు చెందిన అభ్యర్థులకు ఎంపిక నిర్వహిస్తామని ఆర్మీవర్గాలు చెప్పాయి.
First Published:  2 July 2015 1:06 PM GMT
Next Story