Telugu Global
Others

బ‌స్సు సైలెన్స‌ర్ ఊడి స్కూట‌రిస్ట్ దుర్మ‌ర‌ణం..!

ఆర్టీసీ బ‌స్సుల అధ్వాన నిర్వ‌హ‌ణ ఓ నిండుప్రాణాన్ని బ‌లితీసుకుంది. బ‌స్సు సైలెన్స‌ర్ ఊడిప‌డ‌టంతో ఓ వ్య‌క్తి దుర్మ‌ర‌ణం పాలైన సంఘ‌ట‌న లాలాగూడ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకుంది. మ‌ల్కాజిగిరి వ‌సంత‌పురం కాల‌నీకి చెందిన ఎం.జ‌గ‌దీష్ (45) మెకానిక్‌. గురువారం ఉద‌యం సికింద్రాబాద్‌లోని త‌న షాప్‌కు బ‌య‌ల్దేరాడు. మీర్జాల‌గూడ చౌర‌స్తా స‌మీపంలో త‌న ముందు వెళ్తున్న‌ ఆర్టీసీ బ‌స్సు సైలెన్స‌ర్ విరిగిప‌డింది. అది వెన‌క వ‌స్తోన్న‌ జ‌గ‌దీష్ స్కూట‌ర్ ముందు చ‌క్రానికి త‌గిలింది. దీంతో జ‌గ‌దీష్ ఎగిరి అదే […]

ఆర్టీసీ బ‌స్సుల అధ్వాన నిర్వ‌హ‌ణ ఓ నిండుప్రాణాన్ని బ‌లితీసుకుంది. బ‌స్సు సైలెన్స‌ర్ ఊడిప‌డ‌టంతో ఓ వ్య‌క్తి దుర్మ‌ర‌ణం పాలైన సంఘ‌ట‌న లాలాగూడ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకుంది. మ‌ల్కాజిగిరి వ‌సంత‌పురం కాల‌నీకి చెందిన ఎం.జ‌గ‌దీష్ (45) మెకానిక్‌. గురువారం ఉద‌యం సికింద్రాబాద్‌లోని త‌న షాప్‌కు బ‌య‌ల్దేరాడు. మీర్జాల‌గూడ చౌర‌స్తా స‌మీపంలో త‌న ముందు వెళ్తున్న‌ ఆర్టీసీ బ‌స్సు సైలెన్స‌ర్ విరిగిప‌డింది. అది వెన‌క వ‌స్తోన్న‌ జ‌గ‌దీష్ స్కూట‌ర్ ముందు చ‌క్రానికి త‌గిలింది. దీంతో జ‌గ‌దీష్ ఎగిరి అదే బ‌స్సు కింద ప‌డ్డాడు. చ‌క్రాలు త‌ల‌పై నుంచి వెళ్ల‌డంతో జ‌గ‌దీష్ అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించాడు. మృతునికి భార్యా, ఇద్ద‌రుపిల్ల‌లు ఉన్నారు.
First Published:  2 July 2015 1:10 PM GMT
Next Story