Telugu Global
Cinema & Entertainment

 కృష్ణవంశీ దర్శకత్వంలో కుర్రహీరో

గోవిందుడు అందరివాడేలే సినిమా తర్వాత కృష్ణవంశీ మళ్లీ సైలెంట్ అయిపోయాడు. పైసా లాంటి డిజాస్టర్ మూవీ తర్వాత తేరుకొని రామ్ చరణ్ తో గోవిందుడు అందరివాడేలే సినిమా చేశాడు కృష్ణవంశీ. ఆ సినిమా హిట్టయినప్పటికీ మళ్లీ ఎలాంటి ప్రాజెక్ట్ ప్రకటించలేదు. మళ్లీ ఇన్ని రోజులకు మరో డిఫరెంట్ కథతో సిద్ధమౌతున్నాడు కృష్ణవంశీ. ఈసారి తన సినిమా కోసం సందీప్ కిషన్ ను హీరోగా తీసుకునే ఆలోచనలో ఉన్నాడు. సందీప్ కిషన్ కెరీర్ ను మలుపుతిప్పేలా ఈ సినిమా […]

 కృష్ణవంశీ దర్శకత్వంలో కుర్రహీరో
X
గోవిందుడు అందరివాడేలే సినిమా తర్వాత కృష్ణవంశీ మళ్లీ సైలెంట్ అయిపోయాడు. పైసా లాంటి డిజాస్టర్ మూవీ తర్వాత తేరుకొని రామ్ చరణ్ తో గోవిందుడు అందరివాడేలే సినిమా చేశాడు కృష్ణవంశీ. ఆ సినిమా హిట్టయినప్పటికీ మళ్లీ ఎలాంటి ప్రాజెక్ట్ ప్రకటించలేదు. మళ్లీ ఇన్ని రోజులకు మరో డిఫరెంట్ కథతో సిద్ధమౌతున్నాడు కృష్ణవంశీ. ఈసారి తన సినిమా కోసం సందీప్ కిషన్ ను హీరోగా తీసుకునే ఆలోచనలో ఉన్నాడు. సందీప్ కిషన్ కెరీర్ ను మలుపుతిప్పేలా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. జేడీ చక్రవర్తితో గతంలో తీసిన గులాబీ సినిమా ఎంత సెన్సేషన్ అయిందో.. తాజాగా సందీప్ కిషన్ తో అలాంటి సినిమాను తీసే ప్లాన్ లో ఉన్నాడు కృష్ణవంశీ. సందీప్ కిషన్ అంకుల్, ప్రముఖ కెమెరామెన్ చోటా కె నాయుడు, ఈ కాంబినేషన్ ను సెట్ చేసేందుకు తెగ ప్రయత్నిస్తున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ సినిమా ఉంటుంది.
First Published:  8 July 2015 7:00 PM GMT
Next Story