Telugu Global
NEWS

సండ్రకు బెయిల్ ఇచ్చిన ఏసీబీ కోర్టు

ఓటుకు నోటు కేసులో కీలక నిందితుడిగా తెలంగాణ ఏసీబీ ఆరోపిస్తున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఏసీబీ కోర్టు సండ్రకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా కొన్ని షరతులు విధించింది. సత్తుపల్లి దాటి బయటకు వెళ్ళరాదని, పాస్‌పోర్టును ఏసీబీకి సమర్పించాలని ఆదేశించింది. రెండు లక్షల రూపాయల పూచీకత్తును కూడా సమర్పించాలని ఆదేశించింది. కేసు విచారణ సందర్బంగా ఏసీబీకి అందుబాటులో ఉండాలని న్యాయమూర్తి ఆదేశించారు.

సండ్రకు బెయిల్ ఇచ్చిన ఏసీబీ కోర్టు
X

ఓటుకు నోటు కేసులో కీలక నిందితుడిగా తెలంగాణ ఏసీబీ ఆరోపిస్తున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఏసీబీ కోర్టు సండ్రకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా కొన్ని షరతులు విధించింది. సత్తుపల్లి దాటి బయటకు వెళ్ళరాదని, పాస్‌పోర్టును ఏసీబీకి సమర్పించాలని ఆదేశించింది. రెండు లక్షల రూపాయల పూచీకత్తును కూడా సమర్పించాలని ఆదేశించింది. కేసు విచారణ సందర్బంగా ఏసీబీకి అందుబాటులో ఉండాలని న్యాయమూర్తి ఆదేశించారు.

First Published:  14 July 2015 3:34 AM GMT
Next Story