Telugu Global
Others

ప్రేమోన్మాది ఘాతుకం... అక్కాచెల్లెళ్లు దుర్మరణం!

ప్రేమోన్మాది దాడిలో గాయపడిన అక్కాచెల్లెళ్లు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. హైదరాబాద్‌లోని మోహ‌న్‌న‌గ‌ర్ కాలనీలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి ఎల్బీనగర్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. దిల్‌సుఖ్‌నగర్ చైతన్యపురి కమర్షియల్ ట్యాక్స్ కాలనీకి చెందిన శ్రీలేఖను అమిత్‌సింగ్ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈరోజు ఉదయం 9 గంటలకు నేరుగా శ్రీలేఖ ఇంటికి వచ్చి ఆమెతో గొడవ పడ్డాడు. అంతేకాక అమెపై కత్తితో దాడి చేశాడు. అడ్డువచ్చిన శ్రీలేఖ సోదరి యామిని […]

ప్రేమోన్మాది ఘాతుకం... అక్కాచెల్లెళ్లు దుర్మరణం!
X

ప్రేమోన్మాది దాడిలో గాయపడిన అక్కాచెల్లెళ్లు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. హైదరాబాద్‌లోని మోహ‌న్‌న‌గ‌ర్ కాలనీలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి ఎల్బీనగర్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. దిల్‌సుఖ్‌నగర్ చైతన్యపురి కమర్షియల్ ట్యాక్స్ కాలనీకి చెందిన శ్రీలేఖను అమిత్‌సింగ్ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈరోజు ఉదయం 9 గంటలకు నేరుగా శ్రీలేఖ ఇంటికి వచ్చి ఆమెతో గొడవ పడ్డాడు. అంతేకాక అమెపై కత్తితో దాడి చేశాడు. అడ్డువచ్చిన శ్రీలేఖ సోదరి యామిని సరస్వతి పైనా విచక్షణారహితంగా కత్తితో దాడికి తెగబడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన కృష్ణారెడ్డి, హైమావతి దంపతులు తమ పిల్లలు యామినీ సరస్వతి, శ్రీలేఖలతో మోహన్‌నగర్‌లో నివాసముంటున్నారు. వీరు పిల్లల చదువు కోసం ఇక్కడకు వచ్చి ఉంటున్నట్టు తెలుస్తోంది. యామినీ గీతం కాలేజీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేయగా, శ్రీలేఖ చెవెళ్ళలోని సాగర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. ఇదే కాలేజీకి చెందిన అమిత్‌సింగ్‌ అనే ఉన్మాది ప్రేమ పేరుతో రెండు సంవత్సరాలుగా వేధిస్తున్నాడు. ఇది తట్టుకోలేక శ్రీలేఖ ఇంట్లో కూడా చెప్పింది. వారు అతనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు కూడా పిలిచి అతనికి వార్నింగ్ ఇచ్చారు. అయినా మార్పురాని అమిత్‌సింగ్‌ తాజాగా మంగళవారం ఉదయం మోహన్‌నగర్‌లోని ఇంట్లో ఉన్న శ్రీలేఖతో మాట్లాడే నెపంతో వచ్చి వివాదానికి దిగాడు. ఇది ముదిరి శ్రీలేఖపై కూడా తెచ్చుకున్న కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. పక్కనే ఉండి అడ్డు వచ్చిన అక్క యామినీపై కూడా అంతే వేగంతో దాడి చేయడంతో అక్కాచెల్లెళ్ళిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరినీ దగ్గరలో ఉన్న ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స అందిస్తుండగా చనిపోయారు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఈ ప్రేమోన్మాది దాడికి దిగడంతో రక్షించేవారు ఎవరూ లేక ఇద్దరూ కూడా తీవ్రంగా గాయపడి చివరకు ప్రాణాలొదిలేశారు. పరారీలో ఉన్న నిందితుడు అమిత్‌సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు డీసీపీ తెలిపారు.

First Published:  14 July 2015 1:37 AM GMT
Next Story