Telugu Global
National

లోక్‌పాల్ కావాలి " బీజేపీ ఎంపి

లోక్‌పాల్ క‌మిటీని ఏర్పాటు చేసి ప్ర‌భుత్వంలోని నేత‌ల‌పై నిఘా ఉంచాల‌ని హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు చెందిన‌ బీజేపీ ఎంపి శాంత కుమార్ పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షాకు ఓ లేఖ రాశారు. పార్ల‌మెంటు వ‌ర్షాకాల‌ స‌మావేశాల తొలి రోజే సొంత పార్టీ ఎంపీ తీరుతో బీజేపీ  ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంది. ఎన్‌డీఏ ప్ర‌భుత్వం వ్యాపం వంటి స్కాంల‌తో సంబంధం లేని వ్య‌క్తులు కూడా త‌ల‌వంచుకోవాల్సి వ‌స్తోంద‌ని, అందువ‌ల్ల పార్టీలో లోక్‌పాల్ క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. […]

లోక్‌పాల్ కావాలి  బీజేపీ ఎంపి
X
లోక్‌పాల్ క‌మిటీని ఏర్పాటు చేసి ప్ర‌భుత్వంలోని నేత‌ల‌పై నిఘా ఉంచాల‌ని హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు చెందిన‌ బీజేపీ ఎంపి శాంత కుమార్ పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షాకు ఓ లేఖ రాశారు. పార్ల‌మెంటు వ‌ర్షాకాల‌ స‌మావేశాల తొలి రోజే సొంత పార్టీ ఎంపీ తీరుతో బీజేపీ ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంది. ఎన్‌డీఏ ప్ర‌భుత్వం వ్యాపం వంటి స్కాంల‌తో సంబంధం లేని వ్య‌క్తులు కూడా త‌ల‌వంచుకోవాల్సి వ‌స్తోంద‌ని, అందువ‌ల్ల పార్టీలో లోక్‌పాల్ క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి వ‌సుంధ‌రారాజే మంత్రులు పంక‌జ్‌ముండేల‌పై ఆయ‌న నేరుగా విమ‌ర్శ‌లు సంధించారు. హిందీలో రాసిన రెండు పేజీల లేఖ‌ను అధ్య‌క్షుడికి పంప‌డంతోపాటు ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌లో కూడా ఆయ‌న పోస్ట్ చేశారు.
First Published:  22 July 2015 3:25 AM GMT
Next Story