Telugu Global
Others

మ‌రో టీడీపీ ఎమ్మెల్యేపై క్రిమిన‌ల్ కేసు!

టీడీపీ ఎమ్మెల్యేల‌పై గ‌తంలో ఉన్న క్రిమిన‌ల్‌కేసులు  ఒక్కోటిగా వెలుగు చూస్తున్నాయి. నెల‌రోజుల క్రితం టీడీపీకి చెందిన మంత్రి నారాయ‌ణ‌పై నాలుగేళ్ల క్రితం హైద‌రాబాద్‌లో క్రిమిన‌ల్ కేసు న‌మోదైన విష‌యం బ‌య‌ట‌ప‌డిన‌ విష‌యం తెలిసిందే. తాజాగా అదే పార్టీకి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌పై క్రిమిన‌ల్ కేసు ఉంద‌ని తెలిసింది. 2005లో ర‌వీంద‌ర్ రెడ్డి అనే వ్య‌క్తికి చెందిన భూమిని ఆక్ర‌మించార‌ని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తోపాటు, ఆయ‌న అనుచ‌రుడు ప్ర‌దీప్ చౌద‌రీతోపాటు మ‌రికొంద‌రిపై క్రిమిన‌ల్‌ కేసు న‌మోదైంది. […]

మ‌రో టీడీపీ ఎమ్మెల్యేపై క్రిమిన‌ల్ కేసు!
X
టీడీపీ ఎమ్మెల్యేల‌పై గ‌తంలో ఉన్న క్రిమిన‌ల్‌కేసులు ఒక్కోటిగా వెలుగు చూస్తున్నాయి. నెల‌రోజుల క్రితం టీడీపీకి చెందిన మంత్రి నారాయ‌ణ‌పై నాలుగేళ్ల క్రితం హైద‌రాబాద్‌లో క్రిమిన‌ల్ కేసు న‌మోదైన విష‌యం బ‌య‌ట‌ప‌డిన‌ విష‌యం తెలిసిందే. తాజాగా అదే పార్టీకి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌పై క్రిమిన‌ల్ కేసు ఉంద‌ని తెలిసింది. 2005లో ర‌వీంద‌ర్ రెడ్డి అనే వ్య‌క్తికి చెందిన భూమిని ఆక్ర‌మించార‌ని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తోపాటు, ఆయ‌న అనుచ‌రుడు ప్ర‌దీప్ చౌద‌రీతోపాటు మ‌రికొంద‌రిపై క్రిమిన‌ల్‌ కేసు న‌మోదైంది. ఓటుకు నోటు కుంభ‌కోణంలో ఏసీబీ పోలీసులు ప్ర‌దీప్ చౌద‌రీ పాత రికార్డులు ప‌రిశీలించిన‌పుడు ఈ కేసు విష‌యం తెలిసింది. ఆ కేసులో వీరంతా ప‌రారీలో ఉన్న‌ట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. అయితే త‌న‌పై కేసు ఉన్న విష‌యాన్ని ఎమ్మెల్యే మాగంటి ఎన్నిక‌ల సంఘానికి తాను స‌మ‌ర్పించిన అఫిడ‌విట్లో తెలియ‌జేశారా? లేదా ? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఒక‌వేళ తెలియ‌జేయ‌కుండా ఉంటే మంత్రి నారాయ‌ణ విష‌యంలో జ‌రిగిన‌ట్లుగా ఎవ‌రైనా ఫిర్యాదు చేస్తే ఈసీ దృష్టిలో ప‌డ్డ మూడో టీడీపీ ఎమ్మెల్యే మాగంటి అవుతారు.
First Published:  21 July 2015 9:05 PM GMT
Next Story