Telugu Global
Cinema & Entertainment

బాహుబ‌లి ద‌రి చేర‌డం సాధ్య‌మా..! 

రాంచ‌ర‌ణ్, శీను వైట్ల  కాంబినేష‌న్ లో  ‘మై నేమ్ ఈజ్ రాజ్’ పేరు తో ఒక చిత్రం సిద్దం అవుతున్న విష‌యం తెలిసిందే.ఈ సినిమా  షూటింగ్   ఇప్ప‌టికే  యాభై శాతం పూర్తి అయిన‌ట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా శాటిలైట్ రైట్స్   దాదాపు 13 కోట్ల‌కు అమ్ముడైన‌ట్లు  సోష‌ల్ మీడియాలో   న్యూస్ హ‌ల్ చ‌ల్ చేస్తుంది.   మరి ఇందులో నిజమెంతో!  ఇందులో స్టంట్‌మెన్ రోల్ చేస్తున్న చెర్రీకి సిస్టర్‌గా హీరోయిన్ కృతి […]

బాహుబ‌లి ద‌రి చేర‌డం సాధ్య‌మా..! 
X
రాంచ‌ర‌ణ్, శీను వైట్ల కాంబినేష‌న్ లో ‘మై నేమ్ ఈజ్ రాజ్’ పేరు తో ఒక చిత్రం సిద్దం అవుతున్న విష‌యం తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే యాభై శాతం పూర్తి అయిన‌ట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ దాదాపు 13 కోట్ల‌కు అమ్ముడైన‌ట్లు సోష‌ల్ మీడియాలో న్యూస్ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. మరి ఇందులో నిజమెంతో!
ఇందులో స్టంట్‌మెన్ రోల్ చేస్తున్న చెర్రీకి సిస్టర్‌గా హీరోయిన్ కృతి కర్బందా కనిపించనుంది. ఈ హీరోతో రకుల్ ప్రీత్‌సింగ్ రొమాన్స్ చేయనుంది. ఒకవేళ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ 13 కోట్లు వెళ్లినా, బాహుబలిని అందుకోలేదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడిపోతున్నాయి. బాహుబ‌లి చేసిన బిజినెస్ ను ఓవ‌రాల్ గా టాలీవుడ్ ఇప్ప‌ట్లో రీచ్ కావ‌డం అసాధ్య‌మ‌నేది మ‌న అంద‌రీకి తెలిసిందే. మ‌ళ్లీ రాజ‌మౌళి నే ఒక మ‌ల్టీ స్టార‌ర్ ఫిల్మ్ చేసి ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చే్స్తేనే అది సాధ్య ప‌డుతుందేమో చూడాలి..
First Published:  25 July 2015 11:00 PM GMT
Next Story