Telugu Global
NEWS

హోదాపై కలిసి వస్తే మంచిదే: బొత్స

ప్రత్యేక హోదా కోసం కలిసి వస్తే అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధించకపోతే ప్రజలు టీడీపీ ఎంపీల బట్టలూడదీస్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఎందుకు?… రూ. 10 వేల కోట్లు చాలని సుజానా ఎలా అన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈనెల 10 న ఢిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద జగన్ దీక్ష జరుగుతుందని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ […]

హోదాపై కలిసి వస్తే మంచిదే: బొత్స
X
ప్రత్యేక హోదా కోసం కలిసి వస్తే అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధించకపోతే ప్రజలు టీడీపీ ఎంపీల బట్టలూడదీస్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఎందుకు?… రూ. 10 వేల కోట్లు చాలని సుజానా ఎలా అన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈనెల 10 న ఢిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద జగన్ దీక్ష జరుగుతుందని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. దీక్ష అనంతరం పార్లమెంట్‌ వరకు పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. జేసీ వ్యాఖ్యలపై బాబు ఏం సమాధానం చెబుతారని బొత్స ప్రశ్నించారు. పవన్‌ ప్రతిపక్షమో… అధికారపక్షమో చెప్పాలని బొత్స అన్నారు. ప్రత్యేకహోదా అనేది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశమని, దీనికి అందరూ కలిసివస్తే డిమాండు సాధన సులువు అవుతుందని ఆయన అన్నారు.
First Published:  1 Aug 2015 6:19 AM GMT
Next Story