Telugu Global
Others

ప్ర‌భుత్వం ఎత్తుకు రేష‌న్ డీల‌ర్లు చిత్తు 

47 వేల కార్డులు స‌రెండ‌ర్..బోగ‌స్ రేష‌న్‌ కార్డుల‌ను అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం వేసిన ఎత్తుగ‌డ‌కు రేష‌న్ డీల‌ర్లు చిత్త‌య్యారు. 47 వేల బోగ‌స్ రేష‌న్ కార్డులు ప్ర‌భుత్వానికి స‌రెండ‌ర్ చేశారు. రంగారెడ్డి జిల్లాలోని పౌర‌స‌ర‌ఫ‌రా శాఖ అధికారులు రేష‌న్ కార్డుదారులు స్వీయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను అంద‌చేయాల‌ని, ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు లేనివారి కార్డులు ర‌ద్దు చేయాల‌ని రేష‌న్ డీల‌ర్ల‌ను ఆదేశించారు. దీంతో అక్ర‌మార్కుల భాగోతం బయట ప‌డింది. స్వీయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం ఇవ్వ‌ని 47 వేల కార్డులు వెన‌క్కి వ‌చ్చాయి. […]

ప్ర‌భుత్వం ఎత్తుకు రేష‌న్ డీల‌ర్లు చిత్తు 
X
47 వేల కార్డులు స‌రెండ‌ర్..బోగ‌స్ రేష‌న్‌ కార్డుల‌ను అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం వేసిన ఎత్తుగ‌డ‌కు రేష‌న్ డీల‌ర్లు చిత్త‌య్యారు. 47 వేల బోగ‌స్ రేష‌న్ కార్డులు ప్ర‌భుత్వానికి స‌రెండ‌ర్ చేశారు. రంగారెడ్డి జిల్లాలోని పౌర‌స‌ర‌ఫ‌రా శాఖ అధికారులు రేష‌న్ కార్డుదారులు స్వీయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను అంద‌చేయాల‌ని, ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు లేనివారి కార్డులు ర‌ద్దు చేయాల‌ని రేష‌న్ డీల‌ర్ల‌ను ఆదేశించారు. దీంతో అక్ర‌మార్కుల భాగోతం బయట ప‌డింది. స్వీయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం ఇవ్వ‌ని 47 వేల కార్డులు వెన‌క్కి వ‌చ్చాయి. దీంతో ప్ర‌భుత్వానికి నెల‌కు వెయ్యి ట‌న్నుల స‌బ్సిడీ బియ్యం ఆదా కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర‌వ్యాప్తంగా ఈ ప్ర‌క్రియ‌ను అమ‌లు చేసేందుకు అధికారులు పావులు క‌దుపుతున్నారు.
First Published:  31 July 2015 1:24 PM GMT
Next Story