Telugu Global
CRIME

బాకీ తీర్చ‌మ‌న్నందుకు ఫ్రెండును చంపేశాడు 

ఇద్ద‌రు స్నేహితుల మ‌ధ్య చెల‌రేగిన డ‌బ్బు వివాదం ఒక‌రిని బ‌లి తీసుకుంటే మ‌రొక‌రిని హంత‌కుడిని చేసింది. వివ‌రాల్లోకి వెళితే  రంగారెడ్డి జిల్లా ప‌రిగి మండ‌లం నారాయ‌ణ్‌పూర్‌కు చెందిన మ‌ఖ్తార్, చిగురాల్‌ప‌ల్లి నివాసి రాఘ‌వేంద‌ర్ స్నేహితులు. వీరు గ‌తంలో ఇంట‌ర్‌నెట్ కేఫ్ నిర్వ‌హ‌ణ కోసం హైద‌రాబాద్‌లో శిక్ష‌ణ తీసుకున్నారు.  ఆ స‌మ‌యంలో  మ‌ఖ్తార్ అక్క‌డ ప‌ని చేస్తున్న మ‌హిళ వ‌ద్ద నుంచి  రూ. 20వేల‌ను రాఘ‌వేంద‌ర్‌కు ఇప్పించాడు. అయితే, అత‌ను బాకీ డ‌బ్బులు చెల్లించ‌క పోవ‌డంతో ఆమె ముఖ్తార్ […]

ఇద్ద‌రు స్నేహితుల మ‌ధ్య చెల‌రేగిన డ‌బ్బు వివాదం ఒక‌రిని బ‌లి తీసుకుంటే మ‌రొక‌రిని హంత‌కుడిని చేసింది. వివ‌రాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా ప‌రిగి మండ‌లం నారాయ‌ణ్‌పూర్‌కు చెందిన మ‌ఖ్తార్, చిగురాల్‌ప‌ల్లి నివాసి రాఘ‌వేంద‌ర్ స్నేహితులు. వీరు గ‌తంలో ఇంట‌ర్‌నెట్ కేఫ్ నిర్వ‌హ‌ణ కోసం హైద‌రాబాద్‌లో శిక్ష‌ణ తీసుకున్నారు. ఆ స‌మ‌యంలో మ‌ఖ్తార్ అక్క‌డ ప‌ని చేస్తున్న మ‌హిళ వ‌ద్ద నుంచి రూ. 20వేల‌ను రాఘ‌వేంద‌ర్‌కు ఇప్పించాడు. అయితే, అత‌ను బాకీ డ‌బ్బులు చెల్లించ‌క పోవ‌డంతో ఆమె ముఖ్తార్ ను అడ‌గ‌సాగింది. దీంతో మ‌ఖ్తార్ రాఘ‌వేంద‌ర్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకు రావ‌డంతో పాటు అత‌ని ఫోన్‌ను కూడా రూ. 8వేల‌కు అమ్మేసాడు. ఇది భ‌రించ‌లేని రాఘ‌వేంద‌ర్ మ‌రో ఇద్ద‌రు స్నేహితుల‌తో క‌లిసి మ‌ఖ్తార్‌ను చంపి ముక్కులు ముక్కులుగా చేసి బోరు బావిలో ప‌డేశాడు. మ‌ఖ్తార్ క‌న‌ప‌డ‌డం లేద‌ని కుటుంబ‌స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ హ‌త్య వెలుగులోకి వ‌చ్చింది.
First Published:  1 Aug 2015 1:12 PM GMT
Next Story