Telugu Global
Others

బీజేపీ స‌చివాల‌య ముట్ట‌డి భ‌గ్నం 

విధుల నుంచి తొల‌గించిన మున్సిప‌ల్ కార్మికుల‌ను తిరిగి తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత‌లు చేప‌ట్టిన ఛ‌లో సెక్ర‌టేరియ‌ట్ ను పోలీసులు భ‌గ్నం చేవారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు చ‌లో సెక్ర‌టేరియ‌ట్ పిలుపుతో బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో పాటు మున్సిప‌ల్ కార్మికులు కూడా  ర్యాలీగా బ‌య‌లుదేరారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు ఇందిరార‌పార్కు మ‌ర్రి చెన్నారెడ్డి మెమోరియ‌ల్ రాక్ గార్డెన్ వ‌ద్ద వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై […]

విధుల నుంచి తొల‌గించిన మున్సిప‌ల్ కార్మికుల‌ను తిరిగి తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత‌లు చేప‌ట్టిన ఛ‌లో సెక్ర‌టేరియ‌ట్ ను పోలీసులు భ‌గ్నం చేవారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు చ‌లో సెక్ర‌టేరియ‌ట్ పిలుపుతో బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో పాటు మున్సిప‌ల్ కార్మికులు కూడా ర్యాలీగా బ‌య‌లుదేరారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు ఇందిరార‌పార్కు మ‌ర్రి చెన్నారెడ్డి మెమోరియ‌ల్ రాక్ గార్డెన్ వ‌ద్ద వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. చ‌లో సెక్ర‌టేరియ‌ట్‌లో కిష‌న్‌రెడ్డితో పాటు శాస‌న‌స‌భాప‌క్ష‌నేత ల‌క్ష్మ‌ణ్‌, ఎమ్మెల్యేలు చింత‌ల రామ‌చంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్ర‌భాక‌ర్‌, మాజీ ఎమ్మెల్యే బ‌ద్దం బాల్‌రెడ్డి త‌దిత‌ర్లు పాల్గొన్నారు.
First Published:  1 Aug 2015 1:13 PM GMT
Next Story