Telugu Global
NEWS

జ‌గ‌న్‌కు చేరువ‌వుతున్న వామ‌ప‌క్షాలు

ఢిల్లీ ధ‌ర్నాకు సీపీఐ మ‌ద్ద‌తు వైఎస్ఆర్ కాంగ్రెస్‌కి వామ‌ప‌క్షాలు ద‌గ్గ‌ర‌వుతున్నాయ‌నేందుకు ఇది మ‌రో ఉదాహ‌ర‌ణ. ఇప్ప‌టికే సీపీఎం ఆందోళ‌న‌ల‌కు వైఎస్ ఆర్ కాంగ్రెస్ సంఘీభావం ప్ర‌క‌టిస్తుండ‌గా ఇపుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పోరాటానికి సీపీఐ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా కోసం ఈనెల 10న ఢిల్లీలో జ‌రిగే ధ‌ర్నా కార్య‌క్ర‌మానికి సంపూర్ణ మ‌ద్దతు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు సీపీఐ ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభాగం ప్ర‌క‌టించింది. సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ ఈ విష‌యాన్ని స్వ‌యంగా ధృవీక‌రించారు. విజ‌య‌వాడ ప్రెస్ క్ల‌బ్‌లో […]

జ‌గ‌న్‌కు చేరువ‌వుతున్న వామ‌ప‌క్షాలు
X
ఢిల్లీ ధ‌ర్నాకు సీపీఐ మ‌ద్ద‌తు
వైఎస్ఆర్ కాంగ్రెస్‌కి వామ‌ప‌క్షాలు ద‌గ్గ‌ర‌వుతున్నాయ‌నేందుకు ఇది మ‌రో ఉదాహ‌ర‌ణ. ఇప్ప‌టికే సీపీఎం ఆందోళ‌న‌ల‌కు వైఎస్ ఆర్ కాంగ్రెస్ సంఘీభావం ప్ర‌క‌టిస్తుండ‌గా ఇపుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పోరాటానికి సీపీఐ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా కోసం ఈనెల 10న ఢిల్లీలో జ‌రిగే ధ‌ర్నా కార్య‌క్ర‌మానికి సంపూర్ణ మ‌ద్దతు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు సీపీఐ ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభాగం ప్ర‌క‌టించింది. సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ ఈ విష‌యాన్ని స్వ‌యంగా ధృవీక‌రించారు. విజ‌య‌వాడ ప్రెస్ క్ల‌బ్‌లో జ‌రిగిన మీట్‌ది ప్రెస్ కార్య‌క్ర‌మంలో రామ‌కృష్ణ మాట్లాడారు. ప్ర‌త్యేక హోదా కోసం జ‌రిగే అన్ని ఉద్య‌మాల‌కు తాము మ‌ద్ద‌తిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. ఈనెల 10న పార్ల‌మెంటులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి ప్రత్యేక హోదా ప్ర‌క‌టించ‌క‌పోతే 11 వ‌తేదీన రాష్ట్ర బంద్ చేప‌డ‌తామ‌ని రామ‌కృష్ణ ప్ర‌క‌టించారు. ఈ బంద్‌లో అన్ని రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జాసంఘాలు పాల్గొనాల‌ని ఆయ‌న కోరారు. ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని సాక్షాత్తూ పార్ల‌మెంటులో ప్ర‌ధాన‌మంత్రి చేసిన ప్ర‌క‌ట‌న‌కే విలువ లేకుండా పోయింద‌ని ఆయ‌న అన్నారు.
First Published:  6 Aug 2015 12:09 AM GMT
Next Story