Telugu Global
CRIME

ప్రియురాలిపై సామూహిక అత్యాచారం 

మూడేళ్లుగా ప్రేమిస్తున్న ప్రియురాలి పైనే స్నేహితుల‌తో క‌లిసి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డాడు ఓ ప్రియుడు. ఈ సంఘ‌ట‌న వ‌రంగ‌ల్ జిల్లా  లింగాల‌ఘ‌ణ‌పురం మండలంలోని  ఓ రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్‌లో జ‌రిగింది. ధ‌ర్మ‌సాగ‌ర్ మండ‌లానికి చెందిన ఓ విద్యార్ధిని స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌లో ఇంట‌ర్ ఒకేష‌న‌ల్ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతోంది. ఈ విద్యార్ధిని జన‌గామ‌లోని డీజే సౌండ్స్ సిస్టంలో ప‌ని చేస్తున్న ఆలీం… మూడేళ్ళ‌గా ప్రేమించుకుంటున్నారు. స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌కు వ‌చ్చిన విద్యార్ధిని ఆలీంకు ఫోన్ చేసింది. ఇద్ద‌రూ క‌లిసి బైక్‌పై జ‌న‌గామ‌కు […]

ప్రియురాలిపై సామూహిక అత్యాచారం 
X
మూడేళ్లుగా ప్రేమిస్తున్న ప్రియురాలి పైనే స్నేహితుల‌తో క‌లిసి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డాడు ఓ ప్రియుడు. ఈ సంఘ‌ట‌న వ‌రంగ‌ల్ జిల్లా లింగాల‌ఘ‌ణ‌పురం మండలంలోని ఓ రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్‌లో జ‌రిగింది. ధ‌ర్మ‌సాగ‌ర్ మండ‌లానికి చెందిన ఓ విద్యార్ధిని స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌లో ఇంట‌ర్ ఒకేష‌న‌ల్ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతోంది. ఈ విద్యార్ధిని జన‌గామ‌లోని డీజే సౌండ్స్ సిస్టంలో ప‌ని చేస్తున్న ఆలీం… మూడేళ్ళ‌గా ప్రేమించుకుంటున్నారు. స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌కు వ‌చ్చిన విద్యార్ధిని ఆలీంకు ఫోన్ చేసింది. ఇద్ద‌రూ క‌లిసి బైక్‌పై జ‌న‌గామ‌కు చేరి రాత్రి స‌మ‌యంలో లింగాల‌ఘ‌ణ‌పురంలోని ఓ రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్‌కు వెళ్లారు. అక్క‌డ నుంచి ఆలీం త‌న స్నేహితులు ముగ్గురుకు ఫోన్ చేసి పిలిపించాడు. విద్యార్థినితో బ‌ల‌వంతంగా మ‌ద్యం తాగించి న‌లుగురూ అత్యాచారానికి పాల్ప‌డ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
First Published:  6 Aug 2015 1:12 AM GMT
Next Story