Telugu Global
Others

నిజాం కాలేజీలో ర్యాగింగ్ కలకలం

నిజాం కాలేజీలో ర్యాగింగ్ చేస్తున్నారంటూ ఫోన్ కాల్ రావడం కలకలం రేపింది. డిగ్రి బీఎస్సీ సెకండియర్ విద్యార్థిని రాజేశ్వరి పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసింది. థర్డ్ ఇయర్ విద్యార్థి రాజశేఖర్ తనను వేధిస్తున్నాడని, వేధింపులకు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని పోలీసులకు తెలిపింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రాజేశ్వరిని తమ రక్షణలోకి తీసుకుని వేధింపులకు గురి చేస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

నిజాం కాలేజీలో ర్యాగింగ్ చేస్తున్నారంటూ ఫోన్ కాల్ రావడం కలకలం రేపింది. డిగ్రి బీఎస్సీ సెకండియర్ విద్యార్థిని రాజేశ్వరి పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసింది. థర్డ్ ఇయర్ విద్యార్థి రాజశేఖర్ తనను వేధిస్తున్నాడని, వేధింపులకు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని పోలీసులకు తెలిపింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రాజేశ్వరిని తమ రక్షణలోకి తీసుకుని వేధింపులకు గురి చేస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
First Published:  5 Aug 2015 1:17 PM GMT
Next Story