తెలంగాణకు కేంద్రం రూ. 4,700 కోట్ల నిధులు మంజూరు
రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల బలోపేతానికి రూ. 4,700 కోట్ల నిధులను కేటాయించేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఏన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన అందరికీ విద్యుత్ ( పవర్ ఫర్ ఆల్) పథకం కింద ఈ ఏడాదే ఆ నిధులను విడుదల చేసేందుకు సానుకూలత వ్యక్తం చేసింది. ఇందులో దాదాపు రూ. 700 కోట్ల విడుదలకు సంబంధించి కచ్చితమైన హామీ లభించింది. పవర్ ఫర్ ఆల్ పథకానికి ఏపీ, రాజస్థాన్ రాష్ట్రాలను ఇప్పటికే ఎంపిక చేసిన కేంద్రం […]
BY admin7 Aug 2015 1:11 PM GMT
admin Updated On: 8 Aug 2015 1:04 AM GMT
రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల బలోపేతానికి రూ. 4,700 కోట్ల నిధులను కేటాయించేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఏన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన అందరికీ విద్యుత్ ( పవర్ ఫర్ ఆల్) పథకం కింద ఈ ఏడాదే ఆ నిధులను విడుదల చేసేందుకు సానుకూలత వ్యక్తం చేసింది. ఇందులో దాదాపు రూ. 700 కోట్ల విడుదలకు సంబంధించి కచ్చితమైన హామీ లభించింది. పవర్ ఫర్ ఆల్ పథకానికి ఏపీ, రాజస్థాన్ రాష్ట్రాలను ఇప్పటికే ఎంపిక చేసిన కేంద్రం ఇప్పుడు తెలంగాణను కూడా ఆ పథకం పరిధిలోకి తీసుకురావడానికి అంగీకరించింది. అందుకోసం కేటాయించిన నిధుల్లో తొలి విడతగా రూ.700 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించింది.
Next Story