Telugu Global
NEWS

రూ. 60వేలకు భార్య విక్రయం!

ఆరేండ్లు కాపురం చేసి ఇద్దరు పిల్లలు పుట్టాక డబ్బుకు ఆశపడి భార్యను అమ్మేశాడో భర్త. ఏడాది కిందటే ఈ ఘటన జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట  గ్రామానికి చెందిన మహిళను అదే గ్రామానికి చెందిన రాజు ఎనిమిదేళ్ళ కిందట వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు పుట్టారు. ఏడాది కిందట రాజు తన భార్యను బాన్సువాడకు చెందిన మల్లయ్యకు రూ.60 వేలకు అమ్మేశాడు. కొంతకాలానికే మహిళ తల్లిదండ్రులే మల్లయ్యకు డబ్బులు […]

రూ. 60వేలకు భార్య విక్రయం!
X
ఆరేండ్లు కాపురం చేసి ఇద్దరు పిల్లలు పుట్టాక డబ్బుకు ఆశపడి భార్యను అమ్మేశాడో భర్త. ఏడాది కిందటే ఈ ఘటన జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామానికి చెందిన మహిళను అదే గ్రామానికి చెందిన రాజు ఎనిమిదేళ్ళ కిందట వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు పుట్టారు. ఏడాది కిందట రాజు తన భార్యను బాన్సువాడకు చెందిన మల్లయ్యకు రూ.60 వేలకు అమ్మేశాడు. కొంతకాలానికే మహిళ తల్లిదండ్రులే మల్లయ్యకు డబ్బులు తిరిగి ఇచ్చేసి ఆమెను పుట్టింటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆమె భర్తకు విడాకులు ఇచ్చింది. ఇద్దరు పిల్లలతో మెదక్ జిల్లాకు వెళ్లిన రాజు మేనకోడలిని మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. ఇటీవల మేనకోడలు మరో వ్యక్తితో వెళ్లిపోయింది. ఇద్దరు పిల్లల ఆలనాపాలనా భారంగా మారడంతో రాజు వాళ్లను తన పాత భార్య ఇంటికి తీసుకొచ్చి రోడ్డుపై వదిలి వెళ్ళిపోయాడు. పిల్లలు తల్లి దగ్గరకు చేరడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వచ్చి ప్రశ్నించగా తాను భర్తకు విడాకులు ఇచ్చానని, తమ కులంలో భార్యను విక్రయించడం తప్పుకాదని చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కుల పెద్దలు తప్పు పడతారని చెప్పింది.
First Published:  13 Aug 2015 5:00 AM GMT
Next Story