Telugu Global
Others

మన గొప్ప బాబుకు తప్ప అందరికీ తెలుసు: రఘువీరా

భారతీయుల గొప్పదనం ఏపాటిదో ప్రపంచ దేశాలన్నీ గుర్తిస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం విదేశీయులకు పెద్దపీట వేస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. భారతీయులు ఇతర కంపెనీలకు సీఈవోలుగా ఉంటే… ఏపీ రాజధాని నిర్మాణ పనులు మాత్రం ఇతర దేశాలకు అప్పగించడం భారతీయులను అవమానపర్చడమే అని రఘువీరా దుయ్యబట్టారు. రాజధాని కోసం సేకరించిన భూమిని ఎలా వినియోగిస్తున్నారో తెలిపాలని డిమాండ్‌ చేశారు. పారదర్శకత లేకుండా ప్రభుత్వం విదేశీ ప్రతినిధులతో వ్యాపార ఒప్పందాలు చేసుకుంటుందని ఆరోపించారు. కేంద్రంలో […]

మన గొప్ప బాబుకు తప్ప అందరికీ తెలుసు: రఘువీరా
X
భారతీయుల గొప్పదనం ఏపాటిదో ప్రపంచ దేశాలన్నీ గుర్తిస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం విదేశీయులకు పెద్దపీట వేస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. భారతీయులు ఇతర కంపెనీలకు సీఈవోలుగా ఉంటే… ఏపీ రాజధాని నిర్మాణ పనులు మాత్రం ఇతర దేశాలకు అప్పగించడం భారతీయులను అవమానపర్చడమే అని రఘువీరా దుయ్యబట్టారు. రాజధాని కోసం సేకరించిన భూమిని ఎలా వినియోగిస్తున్నారో తెలిపాలని డిమాండ్‌ చేశారు. పారదర్శకత లేకుండా ప్రభుత్వం విదేశీ ప్రతినిధులతో వ్యాపార ఒప్పందాలు చేసుకుంటుందని ఆరోపించారు. కేంద్రంలో ఏడాది పాలనలో నలుగురు బీజేపీ సీఎం, ఇద్దరు కేంద్రమంత్రులు అవినీతికి పాల్పడ్డారన్నారు. ఏపీలో సీఎంతో సహా మంత్రులు హోల్‌సేల్‌ దోచుకుంటున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. విదేశీయులతో చీకటి ఒప్పందాలు రద్దు చేసుకుని మన రాజధానిని మనమే నిర్మించుకోవాలని రఘువీరారెడ్డి హితవు పలికారు.
First Published:  15 Aug 2015 2:57 AM GMT
Next Story