Telugu Global
NEWS

పంట పోలాలపై మళ్లీ గజరాజుల హల్‌చల్‌

చిత్తురు జిల్లాలో మళ్లీ గజరాజులు పంట పొలాలపై దాడులు చేశాయి. ఎన్నో రోజులుగా ఈ తంతు జరుగుతున్నా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎర్రవారిపాలెంలోని అనేక ప్రాంతాల్లో పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేశాయి. దీనితో టమాటతోపాటు ఇతర పంటలు ధ్వంసమయ్యాయి. తమ పంటలను కాపాడేందుకు రైతులు విశ్వప్రయత్నాలు చేశారు. గత 15 రోజులుగా రామకుప్పం, కుప్పం, కాంచీపురం ప్రాంతాల్లో గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో నీటి కొరత కారణంగానే […]

పంట పోలాలపై మళ్లీ గజరాజుల హల్‌చల్‌
X

చిత్తురు జిల్లాలో మళ్లీ గజరాజులు పంట పొలాలపై దాడులు చేశాయి. ఎన్నో రోజులుగా ఈ తంతు జరుగుతున్నా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎర్రవారిపాలెంలోని అనేక ప్రాంతాల్లో పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేశాయి. దీనితో టమాటతోపాటు ఇతర పంటలు ధ్వంసమయ్యాయి. తమ పంటలను కాపాడేందుకు రైతులు విశ్వప్రయత్నాలు చేశారు. గత 15 రోజులుగా రామకుప్పం, కుప్పం, కాంచీపురం ప్రాంతాల్లో గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో నీటి కొరత కారణంగానే గ్రామల్లోకి ఏనుగులు ప్రవేశిస్తున్నాయని తెలుస్తోంది. వీటికి ఇటీవల అధికారులు సాగునీటి సదుపాయం కల్పించినా ప్రయోజనం లేకపోయింది. మళ్లీ ఏనుగులు గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.

First Published:  17 Aug 2015 12:24 AM GMT
Next Story