Telugu Global
CRIME

ప్రియుడి కోసం భ‌ర్త‌ను న‌రికిన భార్య‌!

వివాహేత‌ర సంబంధానికి అడ్డుగా ఉన్నాడ‌న్న నెపంతో క‌ట్టుకున్న భ‌ర్త‌ను క‌డ‌తేర్చింది ఓ న‌డిఈడు మ‌హిళ‌. భార్య‌భ‌ర్త‌ల బంధాల‌ను మంట‌గ‌లిపిన‌ ఈ ఘ‌ట‌న మెద‌క్ జిల్లా శివ్వంపేట మండ‌లంలో జ‌రిగింది. గోమారం గ్రామానికి చెందిన ఎర్రోల్ల చంద్ర‌య్య‌, రేణుక భార్య‌భ‌ర్త‌లు. చంద్ర‌య్య (50) రైతు వ్య‌వ‌సాయంచేసుకుని జీవిస్తున్నాడు. రేణుక‌కు మ‌రో వ్య‌క్తితో అక్ర‌మ సంబంధం ఉంది. ఈ క్ర‌మంలో వారికి అడ్డుగా ఉన్నాడ‌ని భ‌ర్త చంద్ర‌య్య‌ను హ‌త‌మార్చాల‌నుకున్నారు. సోమ‌వారం  చంద్ర‌య్య‌ను ప‌థ‌కం ప్ర‌కారం.. రేణుక న‌రికి చంపింది. శవాన్ని […]

ప్రియుడి కోసం భ‌ర్త‌ను న‌రికిన భార్య‌!
X
వివాహేత‌ర సంబంధానికి అడ్డుగా ఉన్నాడ‌న్న నెపంతో క‌ట్టుకున్న భ‌ర్త‌ను క‌డ‌తేర్చింది ఓ న‌డిఈడు మ‌హిళ‌. భార్య‌భ‌ర్త‌ల బంధాల‌ను మంట‌గ‌లిపిన‌ ఈ ఘ‌ట‌న మెద‌క్ జిల్లా శివ్వంపేట మండ‌లంలో జ‌రిగింది. గోమారం గ్రామానికి చెందిన ఎర్రోల్ల చంద్ర‌య్య‌, రేణుక భార్య‌భ‌ర్త‌లు. చంద్ర‌య్య (50) రైతు వ్య‌వ‌సాయంచేసుకుని జీవిస్తున్నాడు. రేణుక‌కు మ‌రో వ్య‌క్తితో అక్ర‌మ సంబంధం ఉంది. ఈ క్ర‌మంలో వారికి అడ్డుగా ఉన్నాడ‌ని భ‌ర్త చంద్ర‌య్య‌ను హ‌త‌మార్చాల‌నుకున్నారు. సోమ‌వారం చంద్ర‌య్య‌ను ప‌థ‌కం ప్ర‌కారం.. రేణుక న‌రికి చంపింది. శవాన్ని మాయం చేసేయ‌త్నంలో ఓ సంచిలో మూట‌గ‌ట్టింది. బియ్యం బ‌స్తాలు త‌ర‌లించాల‌ని ఆటో కిరాయి మాట్లాడింది. అదే బ‌స్తాల్లో భ‌ర్త శ‌వాన్ని ఉంచిన మూట‌ను వేసింది. అందులో నుంచి ర‌క్తం కార‌డంతో ఆటో డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్త‌మ‌య్యాడు. వెంట‌నే విష‌యాన్ని గ్రామ‌స్తుల‌కు తెలియ‌జేశాడు. వారు వ‌చ్చి మూట‌ను విప్పి చూడ‌గా అందులో నుంచి చంద్ర‌య్య మృత‌దేహం బ‌య‌ట‌ప‌డింది. స‌మాచారం అందుకున్న పోలీసులు రేణుక‌ను పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఆమె ప్రియుడు ప‌రారీలో ఉన్నాడు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.
First Published:  18 Aug 2015 12:05 AM GMT
Next Story