Telugu Global
Others

రాజధాని భూసేకరణకు నోటిఫికేషన్‌

ఏపీ రాజధాని కోసం భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొదట పది గ్రామాల్లో భూసేకరణకు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.  రేపు మరో 19 గ్రామాల్లో భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు ఇచ్చినట్టు చెబుతున్న ప్రభుత్వం మరో 3,892 ఎకరాల భూమిని సేకరించాలని ఏపీ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా భూసేకరణ నోటిఫికేషన్‌పై కాంగ్రెస్‌, వైసీపీ, వామపక్షాల కార్యకర్తలు సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. భూసేకరణను అడ్డుకుంటామని, ఉన్న 33 […]

రాజధాని భూసేకరణకు నోటిఫికేషన్‌
X
ఏపీ రాజధాని కోసం భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొదట పది గ్రామాల్లో భూసేకరణకు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. రేపు మరో 19 గ్రామాల్లో భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు ఇచ్చినట్టు చెబుతున్న ప్రభుత్వం మరో 3,892 ఎకరాల భూమిని సేకరించాలని ఏపీ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా భూసేకరణ నోటిఫికేషన్‌పై కాంగ్రెస్‌, వైసీపీ, వామపక్షాల కార్యకర్తలు సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. భూసేకరణను అడ్డుకుంటామని, ఉన్న 33 వేల ఎకరాలు ఎలా ఉపయోగిస్తారో ముందు చెప్పాలని వైఆర్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండు చేసింది.
First Published:  20 Aug 2015 11:57 PM GMT
Next Story