Telugu Global
Others

మ‌న‌మంతా ఒకే కుటుంబం: ష‌ర్మిల 

వైఎస్సార్ కోసం కొట్టుకునే ప్ర‌తి గుండె చ‌ప్పుడూ మా కుటుంబానికి చెందినదేనని, మ‌న‌మంతా ఒకే కుటుంబ‌స‌భ్యుల‌మ‌ని దివంగ‌త ముఖ్య‌మంత్రి డా.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కుమార్తె, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకురాలు ష‌ర్మిల అన్నారు. వ‌రంగ‌ల్ జిల్లా ప‌రామ‌ర్శ యాత్ర సంద‌ర్భంగా ఆమె ఏడు కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. మృతుల కుటుంబ‌ స‌భ్యుల‌ను పేరుపేరునా ప‌ల‌క‌రిస్తూ వారి బాగోగుల‌ను తెలుసుకున్నారు. చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు వైఎస్సార్ కుటుంబం అండ‌గా ఉంటుంద‌ని, అధైర్య ప‌డొద్ద‌ని ఆమె భ‌రోసా ఇచ్చారు. ప్రాంత‌, కుల‌మ‌త‌, వ‌ర్గ భేదాలు లేకుండా […]

మ‌న‌మంతా ఒకే కుటుంబం: ష‌ర్మిల 
X
వైఎస్సార్ కోసం కొట్టుకునే ప్ర‌తి గుండె చ‌ప్పుడూ మా కుటుంబానికి చెందినదేనని, మ‌న‌మంతా ఒకే కుటుంబ‌స‌భ్యుల‌మ‌ని దివంగ‌త ముఖ్య‌మంత్రి డా.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కుమార్తె, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకురాలు ష‌ర్మిల అన్నారు. వ‌రంగ‌ల్ జిల్లా ప‌రామ‌ర్శ యాత్ర సంద‌ర్భంగా ఆమె ఏడు కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. మృతుల కుటుంబ‌ స‌భ్యుల‌ను పేరుపేరునా ప‌ల‌క‌రిస్తూ వారి బాగోగుల‌ను తెలుసుకున్నారు. చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు వైఎస్సార్ కుటుంబం అండ‌గా ఉంటుంద‌ని, అధైర్య ప‌డొద్ద‌ని ఆమె భ‌రోసా ఇచ్చారు. ప్రాంత‌, కుల‌మ‌త‌, వ‌ర్గ భేదాలు లేకుండా వైఎస్సార్ అంద‌ర్నీ స‌మ‌దృష్టితో చూశార‌ని ష‌ర్మిల ఈ సంద‌ర్భంగా అన్నారు. మృతుల కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శిస్తున్న స‌మ‌యంలో ఆమె కూడా భావోద్వేగానికి గుర‌య్యారు. ఈ యాత్ర‌లో పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డితో పాటు ప‌లువురు నేత‌లు ఆమె వెంట ఉన్నారు.
First Published:  25 Aug 2015 2:05 AM GMT
Next Story