Telugu Global
NEWS

నిన్న ఆటోడ్రైవర్... నేడు పాదచారికి సైకో ఇంజెక్షన్!

పశ్చిమగోదావరి జిల్లాలో కొద్ది రోజులుగా సంచలనం సృష్టిస్తోన్న ఇంజెక్షన్ సైకో తాజాగా మరొకరిపై దాడి చేశాడు. తాడేపల్లిగూడేనికి సమీపంలోని పెంటపాడు మండలం జట్లపాలెంలో ఆదివారం రోడ్డుపై వెళుతున్న బ్రహ్మం అనే 35 ఏళ్ల వ్యక్తికి ఇంజెక్షన్ ఇచ్చి పరారయ్యాడు. బాధిత వ్యక్తిని తాడేపల్లిగూడెంలోని ఆస్పత్రికి తరలించారు. దీంతో ఇప్పటి వరకూ సైకో దాడిలో గాయపడిన వారి సంఖ్య 17కు చేరింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పోలీసులు సైకోను పట్టుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సైకో ఊహా […]

నిన్న ఆటోడ్రైవర్... నేడు పాదచారికి సైకో ఇంజెక్షన్!
X

పశ్చిమగోదావరి జిల్లాలో కొద్ది రోజులుగా సంచలనం సృష్టిస్తోన్న ఇంజెక్షన్ సైకో తాజాగా మరొకరిపై దాడి చేశాడు. తాడేపల్లిగూడేనికి సమీపంలోని పెంటపాడు మండలం జట్లపాలెంలో ఆదివారం రోడ్డుపై వెళుతున్న బ్రహ్మం అనే 35 ఏళ్ల వ్యక్తికి ఇంజెక్షన్ ఇచ్చి పరారయ్యాడు. బాధిత వ్యక్తిని తాడేపల్లిగూడెంలోని ఆస్పత్రికి తరలించారు. దీంతో ఇప్పటి వరకూ సైకో దాడిలో గాయపడిన వారి సంఖ్య 17కు చేరింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పోలీసులు సైకోను పట్టుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సైకో ఊహా చిత్రాన్ని కూడా విడుదల చేశారు. శనివారం సైకో అన్న అనుమానంతో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నప్పటికీ ప్రశ్నించిన తర్వాత వదిలివేశారు.
వారం రోజులుగా మహిళలకు మాత్రమే పరిమితమైన సైకో ఇంజెక్షన్లు తొలిసారిగా శనివారం ఓ ఆటోడ్రైవర్‌పై ప్రయోగించాడు. దిరుసుమర్రు రోడ్డులో భీమవరం వస్తున్న ఆటోను సైకో నల్లరంగు మోటారు బైకుపై క్రాస్‌ చేసి ఆటో నడుపుతున్న ఏసు అనే వ్యక్తికి ఇంజెక్షన్‌ చేసి పరారయ్యాడు. ఇపుడు మరో వ్యక్తిపై ఇంజెక్షన్‌ దాడికి తెగబడ్డాడు.

First Published:  30 Aug 2015 10:07 AM GMT
Next Story