Telugu Global
Others

జాతీయ రాజకీయాల్లోకి మజ్లిస్: ఓవైసీ

జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి మజ్లిస్‌ నడుం బిగించింది. రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించనున్నట్టు ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్‌ ఓవైసీ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా తాము విస్తరించబోతున్నామన్న వార్తలు చూసి కాంగ్రెస్‌కు కలవరం మొదలయ్యిందని ఆయన అన్నారు. ‘ఇక తమ లక్ష్యం ఒక్కటే… కాంగ్రెస్‌ను నామరూపాల్లేకుండా చేయడమే. తమ లక్ష్యం కాంగ్రెస్‌ను భయపెడుతోంది. కాంగ్రెస్‌కే కాదు… జాతీయ రాజకీయాల్లో బీజేపీకి దీటుగా కూడా ‘ఎంఐఎం’ కీలక పాత్ర పోషించనుంది’ అంటూ అసదుద్దీన్‌ ఒవైసీ […]

జాతీయ రాజకీయాల్లోకి మజ్లిస్: ఓవైసీ
X
జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి మజ్లిస్‌ నడుం బిగించింది. రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించనున్నట్టు ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్‌ ఓవైసీ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా తాము విస్తరించబోతున్నామన్న వార్తలు చూసి కాంగ్రెస్‌కు కలవరం మొదలయ్యిందని ఆయన అన్నారు. ‘ఇక తమ లక్ష్యం ఒక్కటే… కాంగ్రెస్‌ను నామరూపాల్లేకుండా చేయడమే. తమ లక్ష్యం కాంగ్రెస్‌ను భయపెడుతోంది. కాంగ్రెస్‌కే కాదు… జాతీయ రాజకీయాల్లో బీజేపీకి దీటుగా కూడా ‘ఎంఐఎం’ కీలక పాత్ర పోషించనుంది’ అంటూ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రకటించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి, బీజేపీకి గుణపాఠం చెప్పి తీరుతామని స్పష్టం చేశారు. చార్మినార్‌ సమీపంలోని ముర్గీచౌక్‌లో జరిగిన మజ్లిస్‌ మాజీ అధ్యక్షుడు ఫక్రేమిల్లత్‌ అబ్దుల్‌ వాహెబ్‌ ఒవైసీ 40వ వర్ధంతి సభలో అసదుద్దీన్‌ పాల్గొన్నారు. ‘బీజేపీ గెలుపుతో.. 1200 ఏళ్లుగా బానిసత్వంలో మగ్గిన భారతదేశానికి విముక్తి లభించిందని మోడీ చెబుతున్నారు. వాస్తవంలో, గత ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు 30 శాతం మాత్రమే. అంటే 70 శాతం ప్రజలు బీజేపీని వ్యతిరేకించినట్టే కదా’ అని ప్రశ్నించారు. బీజేపీకి, మోడీకి మస్లిస్‌ ఏజెంట్‌గా మారిందన్న ఏఐసీసీ నేత దిగ్విజయ్‌ సింగ్‌ వ్యాఖ్యలను ఒవైసీ తీవ్రంగా ఖండించారు. దిగ్విజయ్‌కు త్వరలో లీగల్‌ నోటీస్‌ పంపనున్నట్టు తెలిపారు. త్వరలో జరగనున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో మజ్లిస్‌ సత్తా ఏమిటో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చూపుతామని ఓవైసీ అన్నారు.
First Published:  2 Sep 2015 2:21 AM GMT
Next Story