Telugu Global
Others

ర్యాగింగ్‌ అంటే భయపడేలా చేస్తాం: గంటా

ర్యాగింగ్‌ను అరికట్టడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. భవిష్యత్‌లో ర్యాగింగ్ అనే పదాన్ని ఉచ్చరించాలంటేనే భయపడే పరిస్థితి తీసుకువస్తామని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి 172 మంది విద్యార్థులను విచారణ కమిటీ విచారించిందని గంటా శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయేషా ఘటనను గంటా ప్రస్తావించారు. ఆయేషాది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆమె తల్లిదండ్రులు చెప్పారని గంటా అన్నారు. రిషితేశ్వరి తండ్రి తనకు మెసేజ్‌లు పంపించారని, యూనివర్పిటీలో పరిస్థితులు […]

ర్యాగింగ్‌ను అరికట్టడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. భవిష్యత్‌లో ర్యాగింగ్ అనే పదాన్ని ఉచ్చరించాలంటేనే భయపడే పరిస్థితి తీసుకువస్తామని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి 172 మంది విద్యార్థులను విచారణ కమిటీ విచారించిందని గంటా శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయేషా ఘటనను గంటా ప్రస్తావించారు. ఆయేషాది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆమె తల్లిదండ్రులు చెప్పారని గంటా అన్నారు. రిషితేశ్వరి తండ్రి తనకు మెసేజ్‌లు పంపించారని, యూనివర్పిటీలో పరిస్థితులు మారిపోయాయని ఆయన ప్రభుత్వాన్ని అభినందించారని చెప్పారు.
First Published:  1 Sep 2015 1:57 PM GMT
Next Story