Telugu Global
NEWS

స్కూల్లో ఘర్షణ... ఓ విద్యార్ది మృతి

ఇద్దరు విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఒక విద్యార్థిని బలి తీసుకుంది. ముష్ఠి ఘాతాలతో ఈ విద్యార్థులిద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో బలమైన గాయాలు తగిలిన సిద్ధిఖి అనే విద్యార్థి చనిపోయాడు. హైదరాబాద్ కింగ్ కోఠిలోని సెయింట్ జోసఫ్ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఎందుకు తగాదా పడ్డారో కాని ఒకరు మాత్రం తీవ్రంగా గాయపడ్డాడు. సిద్దిఖి అనే ఈ పదో తరగతి విద్యార్ధి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. చనిపోయిన […]

స్కూల్లో ఘర్షణ... ఓ విద్యార్ది మృతి
X
ఇద్దరు విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఒక విద్యార్థిని బలి తీసుకుంది. ముష్ఠి ఘాతాలతో ఈ విద్యార్థులిద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో బలమైన గాయాలు తగిలిన సిద్ధిఖి అనే విద్యార్థి చనిపోయాడు. హైదరాబాద్ కింగ్ కోఠిలోని సెయింట్ జోసఫ్ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఎందుకు తగాదా పడ్డారో కాని ఒకరు మాత్రం తీవ్రంగా గాయపడ్డాడు. సిద్దిఖి అనే ఈ పదో తరగతి విద్యార్ధి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. చనిపోయిన విద్యార్ది తల్లిదండ్రులు నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. ఈ ఘర్షణ జరుగుతున్నప్పుడు అక్కడ స్కూల్ సిబ్బంది ఎందుకు పట్టించుకోలేదన్న దానికి జవాబు లేదు. అసలు ఈ ఘర్షణ విషయం యాజమాన్యానికి తెలుసో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరి తప్పు ఏమిటో కాని, ముందుగా ఒక పసి ప్రాణం బలై పోయింది.
First Published:  2 Sep 2015 12:56 AM GMT
Next Story