Telugu Global
Others

అత్యాచారం కేసులో ముగ్గురికి 20 ఏళ్ల జైలు

ఈ ఏడాది ఫిబ్రవరిలో జపాన్‌కు చెందిన 19 ఏళ్ల యువతిపై రాజస్థాన్‌లో సామూహిక అత్యాచారం జరిగిన కేసులో ముగ్గురు యువకులకు 20 యేళ్ళపాటు జైలు శిక్ష విధించారు. అయితే బాధితురాలి కథనం ప్రకారం.. జైపూర్‌లోని జల్‌మహల్ ప్రాంతం చూస్తున్నప్పుడు ఓ వ్యక్తి తన వద్దకు వచ్చాడని, అతను ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతూ రాజస్థాన్‌లోని ప్రాంతాల గురించి వివరిస్తుండడంతో గైడ్‌గా సాయం తీసుకున్నానని, మరో ఇద్దరితో కలిసి అతను తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి కోర్టుకు తెలిపింది. […]

ఈ ఏడాది ఫిబ్రవరిలో జపాన్‌కు చెందిన 19 ఏళ్ల యువతిపై రాజస్థాన్‌లో సామూహిక అత్యాచారం జరిగిన కేసులో ముగ్గురు యువకులకు 20 యేళ్ళపాటు జైలు శిక్ష విధించారు. అయితే బాధితురాలి కథనం ప్రకారం.. జైపూర్‌లోని జల్‌మహల్ ప్రాంతం చూస్తున్నప్పుడు ఓ వ్యక్తి తన వద్దకు వచ్చాడని, అతను ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతూ రాజస్థాన్‌లోని ప్రాంతాల గురించి వివరిస్తుండడంతో గైడ్‌గా సాయం తీసుకున్నానని, మరో ఇద్దరితో కలిసి అతను తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి కోర్టుకు తెలిపింది. యేడాది విచారణ తర్వాత కోర్టు ఈ ముగ్గురికి జైలు శిక్షను విధించింది.
First Published:  3 Sep 2015 1:22 PM GMT
Next Story