Telugu Global
Others

చంద్రబాబులో దండిగా సైకో లక్షణాలు: అంబటి రాంబాబు

ఉన్నదున్నట్టుగా మాట్లాడితే సైకో ఎలా అవుతారని, వాస్తవ పరిస్థితుల్ని చెప్పడం వల్ల తట్టుకోలేని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దలు తమ పార్టీని, నేతలను సైకో అంటూ విమర్శలకు దిగుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, ఆ పార్టీ  అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. తమ పార్టీని సైకో అనడంపై ఆయన మండిపడుతూ తీవ్రంగా దుయ్యబట్టారు. 450 ఏళ్ల క్రితం నిర్మించిన హైదరాబాద్‌ను తానే నిర్మించానని చంద్రబాబు పదేపదే చెబుతారని, సెల్ పోన్ తానే తెచ్చానని, ప్రపంచానికి ఐటిని […]

చంద్రబాబులో దండిగా సైకో లక్షణాలు: అంబటి రాంబాబు
X
ఉన్నదున్నట్టుగా మాట్లాడితే సైకో ఎలా అవుతారని, వాస్తవ పరిస్థితుల్ని చెప్పడం వల్ల తట్టుకోలేని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దలు తమ పార్టీని, నేతలను సైకో అంటూ విమర్శలకు దిగుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. తమ పార్టీని సైకో అనడంపై ఆయన మండిపడుతూ తీవ్రంగా దుయ్యబట్టారు. 450 ఏళ్ల క్రితం నిర్మించిన హైదరాబాద్‌ను తానే నిర్మించానని చంద్రబాబు పదేపదే చెబుతారని, సెల్ పోన్ తానే తెచ్చానని, ప్రపంచానికి ఐటిని తానే పరిచయం చేశానని అంటారని, వాస్తవాలకు విరుద్దంగా ఇలా మాట్లాడేవారిని మాత్రమే సైకో లక్షణాలు ఉన్నట్లు అర్ధం చేసుకోవాలని అన్నారు. అంతేకాక అసెంబ్లీలో మీకు పిచ్చి పట్టింది..ఇ ది లోటస్ పాండ్ కాదు.. మీ అంతు చూస్తా.. ఇలాంటి మాటలు మాట్లాడింది చంద్రబాబేనని కనుక ఆయనకే సైకో లక్షణాలు ఉన్నాయని అన్నారు. ఓటుకు నోటు కేసులో సమాధానం చెప్పుకోలేక తన చాంబర్‌కే చంద్రబాబు పరిమితం అయ్యారని, ఇలా ఏ ముఖ్యమంత్రి దొరికిపోలేదని రాంబాబు ద్వజమెత్తారు.
First Published:  6 Sep 2015 12:41 AM GMT
Next Story