Telugu Global
Others

రైతులపై కాంగ్రెస్‌ది కపట ప్రేమ: హరీశ్‌రావు

కాంగ్రెస్ నేతలు పదేళ్లపాటు అధికారంలో ఉండి తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని, అక్రమ ప్రాజెక్టులైన పోతిరెడ్డిపాడు, పులిచింతలపై ఏనాడు కాంగ్రెస్ పార్టీ స్పందించలేదని ఇరిగేషన్‌ శాఖ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా నేతలతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు.  పాలమూరు ఎత్తిపోతల పథకం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ… . ప్రాజెక్టులు రీడిజైన్ చేసి భావితరాలకు నీరందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ నేతలు రాద్దాంతం […]

కాంగ్రెస్ నేతలు పదేళ్లపాటు అధికారంలో ఉండి తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని, అక్రమ ప్రాజెక్టులైన పోతిరెడ్డిపాడు, పులిచింతలపై ఏనాడు కాంగ్రెస్ పార్టీ స్పందించలేదని ఇరిగేషన్‌ శాఖ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా నేతలతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ… . ప్రాజెక్టులు రీడిజైన్ చేసి భావితరాలకు నీరందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ నేతలు రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గల్లంతవుతుందని భయపడుతున్నారు. రాజకీయ నిరుద్యోగంతో దిక్కుతోచక ధర్నాలకు దిగుతున్నారు.
First Published:  6 Sep 2015 1:22 PM GMT
Next Story