Telugu Global
Others

వాహనం ఢీకొని దంపతులు మృతి

తెలంగాణలోని రెండు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు ఐదుగురిని పొట్టన పెట్టుకున్నాయి. గుర్తు తెలియని వాహనం ఢీకొని దంపతులు చనిపోగా, వేగంగా ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలానగర్‌లో చనిపోయిన దంపతులు మహారాష్ట్ర నాందేడ్ వాసులుగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు.  రెండు కార్లు ఢీ.. ముగ్గురు మృతి మెదక్ జిల్లాలోని కొండపాక మండలం కుకునూరుపల్లి దగ్గర జరిగిన […]

తెలంగాణలోని రెండు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు ఐదుగురిని పొట్టన పెట్టుకున్నాయి. గుర్తు తెలియని వాహనం ఢీకొని దంపతులు చనిపోగా, వేగంగా ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలానగర్‌లో చనిపోయిన దంపతులు మహారాష్ట్ర నాందేడ్ వాసులుగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు.
రెండు కార్లు ఢీ.. ముగ్గురు మృతి
మెదక్ జిల్లాలోని కొండపాక మండలం కుకునూరుపల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో హైవేపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మృతులు ఎవరన్నది ఇంకా తెలియలేదు.
First Published:  7 Sep 2015 1:05 PM GMT
Next Story