Telugu Global
CRIME

ఢిల్లీ యువతిపై జైపూర్‌లో అత్యాచారం

ప్రముఖ పర్యాటక నగరం జైపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల యువతిపై పది మంది వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఢిల్లీ శివారులోని మంగోల్‌పురి ప్రాంతానికి చెందిన యువతి తనకు ఉపాధి చూపాలంటూ పొరుగింట్లో ఉండే దంపతులను కోరింది. ఉపాధి చూపుతామని చెప్పిన దంపతులు ఆగస్టు 30న ఆమెను జైపూర్‌ తీసుకెళ్లారు. అక్కడ ఓ హోటల్‌ యజమానికి యువతిని విక్రయించేశారు. హోటల్‌లో ఉన్న ఆమెపై మేనేజర్‌సహా పది మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఆగస్టు 31న హోటల్‌ నుంచి తప్పించుకున్న […]

ఢిల్లీ యువతిపై జైపూర్‌లో అత్యాచారం
X
ప్రముఖ పర్యాటక నగరం జైపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల యువతిపై పది మంది వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఢిల్లీ శివారులోని మంగోల్‌పురి ప్రాంతానికి చెందిన యువతి తనకు ఉపాధి చూపాలంటూ పొరుగింట్లో ఉండే దంపతులను కోరింది. ఉపాధి చూపుతామని చెప్పిన దంపతులు ఆగస్టు 30న ఆమెను జైపూర్‌ తీసుకెళ్లారు. అక్కడ ఓ హోటల్‌ యజమానికి యువతిని విక్రయించేశారు. హోటల్‌లో ఉన్న ఆమెపై మేనేజర్‌సహా పది మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఆగస్టు 31న హోటల్‌ నుంచి తప్పించుకున్న యువతి ఢిల్లీకి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి దంపతులు సహా ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో ఆరుగురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
First Published:  8 Sep 2015 1:24 AM GMT
Next Story