Telugu Global
NEWS

తెలంగాణలో మరో ఐదుగురు రైతుల ఆత్మహత్య

తెలంగాణలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. ముగ్గురు ఉరి వేసుకుని.. ఇద్దరు పురుగుల మందు తాగి… మొత్తం ఐదుగురు రైతులు బలవన్మరణం పాలయ్యారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణానికి చెందిన పింజ భాస్కర్‌ (54) అనే రైతు అప్పుల వారి వేధింపులు ఎక్కువ కావడంతో.. తన పొలంలోనే చెట్టుకు ఉరివేసుకుని చనిపోయారు. ఈయనతోపాటు వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ మండలం అమనగల్‌ శివారు గుండాలగడ్డ తండాకు చెందిన రైతు భూక్య హసిరాం (42), కరీంనగర్‌ జిల్లా ముత్తారం మండలంలోని […]

తెలంగాణలో మరో ఐదుగురు రైతుల ఆత్మహత్య
X

తెలంగాణలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. ముగ్గురు ఉరి వేసుకుని.. ఇద్దరు పురుగుల మందు తాగి… మొత్తం ఐదుగురు రైతులు బలవన్మరణం పాలయ్యారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణానికి చెందిన పింజ భాస్కర్‌ (54) అనే రైతు అప్పుల వారి వేధింపులు ఎక్కువ కావడంతో.. తన పొలంలోనే చెట్టుకు ఉరివేసుకుని చనిపోయారు. ఈయనతోపాటు వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ మండలం అమనగల్‌ శివారు గుండాలగడ్డ తండాకు చెందిన రైతు భూక్య హసిరాం (42), కరీంనగర్‌ జిల్లా ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన జెంబోజు రాంబాబు(28) అనే యువ రైతు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలంలోని కౌఠ(బి) గ్రామానికి చెందిన కొర్రి చిన్నభూమయ్య (40) అనే రైతు, అప్పుల బాధ భరించలేక నల్లగొండ మండలం కుత్భావన్‌పూర్‌కు చెందిన లింగయ్య(65) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

First Published:  8 Sep 2015 12:53 AM GMT
Next Story