Telugu Global
NEWS

ఆగని సైకో దాడులు... తాజాగా మరో నాలుగు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో సిరంజీ సైకో దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో‌, నల్గొండ జిల్లా కోదాడ, పశ్చిమగోదావరి జిల్లాలో రెండుచోట్ల తాజాగా సిరంజీ సైకో దాడులు జరిగాయి. ఒకేసారి ఇలా దాడులు జరగడంతో సైకో ఒక్కడు కాదని, కొంతమంది పని గట్టుకుని ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. తణుకు సమీపంలోని ఇరగవరంలోను, భీమవరంలోను మరోసారి దాడులు జరిగాయి. ఇప్పటివరకు 30 మంది ఈ సైకో దాడికి గురయ్యారు. ఆగని సైకో దాడులతో పోలీసులకు సవాలు విసిరినట్టయ్యింది. ముఖానికి […]

ఆగని సైకో దాడులు... తాజాగా మరో నాలుగు
X
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో సిరంజీ సైకో దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో‌, నల్గొండ జిల్లా కోదాడ, పశ్చిమగోదావరి జిల్లాలో రెండుచోట్ల తాజాగా సిరంజీ సైకో దాడులు జరిగాయి. ఒకేసారి ఇలా దాడులు జరగడంతో సైకో ఒక్కడు కాదని, కొంతమంది పని గట్టుకుని ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. తణుకు సమీపంలోని ఇరగవరంలోను, భీమవరంలోను మరోసారి దాడులు జరిగాయి. ఇప్పటివరకు 30 మంది ఈ సైకో దాడికి గురయ్యారు. ఆగని సైకో దాడులతో పోలీసులకు సవాలు విసిరినట్టయ్యింది. ముఖానికి మాస్క్‌ ధరించి, బ్లాక్‌ బైక్‌ తిరుగుతున్న ఈ సైకో ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. జాతీయ రహదారిపైన నాలుగైదు బృందాలుగా విడిపోయి పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. బ్లాక్‌ బైక్‌ ఉన్న అందరినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
First Published:  7 Sep 2015 11:31 PM GMT
Next Story