మోడీ అమెరికా టూర్కు పటేళ్ల దెబ్బ
స్వదేశంలో పటేళ్ల ఉద్యమం విదేశాలలో కూడా ప్రధాని మోడీని వెంటాడుతోంది. పటీదార్ అనామత్ ఆందోళన సమితి ఆధ్వర్యంలో గుజరాత్ను గజగజలాడిస్తున్న రిజర్వేషన్ సాధన ఉద్యమానికి దేశవ్యాప్తంగా పటేళ్ల నుంచి మద్దతు లభిస్తోంది. తాజాగా ప్రవాసభారతీయులు కూడా పటేళ్ల పోరాటానికి బాసటగా నిలవాలని నిర్ణయించుకున్నారు. అమెరికాలోని ఎడిషన్ నగరంలోలో సమావేశమైన పటేల్ సామాజికర్గానికి చెందిన ఎన్ ఆర్ ఐలు ..రిజర్వేషన్ల సాధన ఉద్యమానికి సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించారు. పటేళ్లకు రిజర్వేషన్లు ప్రకటించేవరకూ గుజరాత్ ప్రభుత్వానికి పటేల్ సామాజికవర్గం […]
BY sarvi9 Sep 2015 3:45 AM GMT
X
sarvi Updated On: 9 Sep 2015 3:45 AM GMT
స్వదేశంలో పటేళ్ల ఉద్యమం విదేశాలలో కూడా ప్రధాని మోడీని వెంటాడుతోంది. పటీదార్ అనామత్ ఆందోళన సమితి ఆధ్వర్యంలో గుజరాత్ను గజగజలాడిస్తున్న రిజర్వేషన్ సాధన ఉద్యమానికి దేశవ్యాప్తంగా పటేళ్ల నుంచి మద్దతు లభిస్తోంది. తాజాగా ప్రవాసభారతీయులు కూడా పటేళ్ల పోరాటానికి బాసటగా నిలవాలని నిర్ణయించుకున్నారు. అమెరికాలోని ఎడిషన్ నగరంలోలో సమావేశమైన పటేల్ సామాజికర్గానికి చెందిన ఎన్ ఆర్ ఐలు ..రిజర్వేషన్ల సాధన ఉద్యమానికి సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించారు. పటేళ్లకు రిజర్వేషన్లు ప్రకటించేవరకూ గుజరాత్ ప్రభుత్వానికి పటేల్ సామాజికవర్గం వ్యాపారులు, పరిశ్రమాధిపతులు, ఇతరులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగవేయాలని పిలుపునిచ్చారు. త్వరలో అమెరికా పర్యటనకు రానున్న మోడీకి తమ నిరసనను తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. మోడీ పర్యటనను తాము బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. ఈ సమావేశానికి వెయ్యి మందికి పైగా ఎన్ ఆర్ ఐలు హాజరయ్యారు.
Next Story