Telugu Global
National

ఇద్దరు రేప్‌ బాధితుల కాల్చివేత

అత్యాచారానికి గురైన ఇద్దరు బాధితులను కాల్చి చంపారు. వీరిలో ఒకరు 2011లో, మరొకరు గత యేడాది అత్యాచారానికి గురయ్యారు. ఈ సంఘటనలు రెండూ ఒకేరోజు ఉత్తరప్రదేశ్‌లో జరిగాయి. వీరిలో ఒక బాధితురాలు తన కేసులో మరో రెండు రోజుల్లోనే కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా ఈ దారుణం జరిగింది. బైజాపూర్‌ జిల్లాలోని దక్షిణ్‌ తోలా గ్రామం వద్ద ఓ బాధితురాలు(18) తన సోదరుడితో కలిసి వైద్యుడి దగ్గరకు వెళుతుండగా బైకుపై వచ్చిన యువకులు కాల్పులు జరిపి తప్పించుకుపోయారు. […]

ఇద్దరు రేప్‌ బాధితుల కాల్చివేత
X
అత్యాచారానికి గురైన ఇద్దరు బాధితులను కాల్చి చంపారు. వీరిలో ఒకరు 2011లో, మరొకరు గత యేడాది అత్యాచారానికి గురయ్యారు. ఈ సంఘటనలు రెండూ ఒకేరోజు ఉత్తరప్రదేశ్‌లో జరిగాయి. వీరిలో ఒక బాధితురాలు తన కేసులో మరో రెండు రోజుల్లోనే కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా ఈ దారుణం జరిగింది. బైజాపూర్‌ జిల్లాలోని దక్షిణ్‌ తోలా గ్రామం వద్ద ఓ బాధితురాలు(18) తన సోదరుడితో కలిసి వైద్యుడి దగ్గరకు వెళుతుండగా బైకుపై వచ్చిన యువకులు కాల్పులు జరిపి తప్పించుకుపోయారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మరణించిందని పోలీసులు వెల్లడించారు. ఈ బాధితురాలిపై ఓ కాలేజీలో మేనేజర్‌గా పనిచేస్తున్న బీకే సింగ్‌ అనే వ్యక్తి 2011 జూన్‌లో అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడు బీకే సింగ్‌ ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, సీతాపూర్‌ జిల్లా, మహ్మద్‌పూర్‌ గ్రామానికి చెందిన ఓ మహిళ(23) గతేడాది తనపై అత్యాచారం చేసినట్లు ప్రదీప్‌ అనే వ్యక్తిపై కేసు పెట్టింది. భర్తతో కలిసి వెళుతుండగా నిందితుడు ప్రదీప్‌ జరిపిన కాల్పుల్లో ఆమె చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఒకేరోజు అత్యాచారానికి గురైన ఇద్దరు బాధితులను కాల్చి చంపిన సంఘటనలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి.
First Published:  14 Sep 2015 5:25 AM GMT
Next Story