తూర్పున టీడీపీ, వైసీపీ వర్గీయుల ఘర్షణ
సాగునీటి సంఘం ఎన్నికల్లో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. తొండంగి మండలం కృష్ణాపురంలో మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో కృష్ణాపురంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. దాడులను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు దాడికి దిగడంతో విలేకరులు పారిపోవాల్సి వచ్చింది. దాడికి కారణం మీరంటే మీరని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.
BY sarvi14 Sep 2015 1:12 PM GMT
sarvi Updated On: 15 Sep 2015 6:30 AM GMT
సాగునీటి సంఘం ఎన్నికల్లో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. తొండంగి మండలం కృష్ణాపురంలో మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో కృష్ణాపురంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. దాడులను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు దాడికి దిగడంతో విలేకరులు పారిపోవాల్సి వచ్చింది. దాడికి కారణం మీరంటే మీరని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.
Next Story