Telugu Global
International

ఉగ్రవాదుల కొట్లాలలో ముగ్గురు హతం

రెండు తీవ్రవాద సంస్థలు ఒకరిపై ఒకరు తలపడ్డారు. అంతిమ ఫలితం ముగ్గురు హతమయ్యారు. వీరిలో సోపోర్ గ్రామానికి చెందిన ఆమిర్ ఖదిర్ రేషి (18) ఒకరు కాగా, మరొకరు లోలిపురాకు చెందిన ఆషిక్ వనీ (23)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ లష్కరే ఇస్లాం సంస్థకు చెందిన వారు. మరొకరి వివరాలు ఇంకా తెలియరాలేదు. గతంలో హిజ్‌బుల్ ముజాహిదీన్‌లో పని చేసిన అబ్దుల ఖయ్యూం నజ్జార్ సొంతంగా లష్కరే ఇస్లాం ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేశాడు. ఇందులో ఆషిక్ […]

ఉగ్రవాదుల కొట్లాలలో ముగ్గురు హతం
X
రెండు తీవ్రవాద సంస్థలు ఒకరిపై ఒకరు తలపడ్డారు. అంతిమ ఫలితం ముగ్గురు హతమయ్యారు. వీరిలో సోపోర్ గ్రామానికి చెందిన ఆమిర్ ఖదిర్ రేషి (18) ఒకరు కాగా, మరొకరు లోలిపురాకు చెందిన ఆషిక్ వనీ (23)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ లష్కరే ఇస్లాం సంస్థకు చెందిన వారు. మరొకరి వివరాలు ఇంకా తెలియరాలేదు. గతంలో హిజ్‌బుల్ ముజాహిదీన్‌లో పని చేసిన అబ్దుల ఖయ్యూం నజ్జార్ సొంతంగా లష్కరే ఇస్లాం ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేశాడు. ఇందులో ఆషిక్ వనీ ఏడాది కాలంగా పనిచేస్తున్నట్లు, రేషి గత జూలైలో అందులో చేరినట్లు పోలీసులు తెలిపారు. లష్కరే ఇస్లాం ఇటీవల కాశ్మీర్‌లో దాడులు చేస్తూ ప్రత్యర్థి వర్గాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని తీవ్రవాద చర్యలు కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నజ్జార్‌ను హతమార్చేందుకు హిజ్బుల్ ప్రయత్నిస్తోంది. దీంతో రెండు ఉగ్రవాద సంస్థల మధ్య పోరు సాగుతున్నది. శ్రీనగర్‌కు సమీపంలో బారాముల్లా జిల్లాలో పట్టాన్‌లో ముగ్గురిని హతమార్చింది.
First Published:  14 Sep 2015 11:59 PM GMT
Next Story