Telugu Global
National

విజృంభిస్తున్న డెంగ్యూ... ఢిల్లీలో 16 మంది మృతి

ఢిల్లీ, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా పలు రాష్ర్టాల్లో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఆ మహమ్మరి భారిన పడి ఇప్పటి వరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు రాష్ర్టాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ జ్వరాల కారణంగా ఇప్పటివరకు నలుగురు మరణించినట్టు అధికారిక సమాచారం. డెంగ్యూ బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వారం రోజుల్లో జార్ఖండ్‌లో 200 మంది ఈ […]

విజృంభిస్తున్న డెంగ్యూ... ఢిల్లీలో 16 మంది మృతి
X
ఢిల్లీ, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా పలు రాష్ర్టాల్లో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఆ మహమ్మరి భారిన పడి ఇప్పటి వరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు రాష్ర్టాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ జ్వరాల కారణంగా ఇప్పటివరకు నలుగురు మరణించినట్టు అధికారిక సమాచారం. డెంగ్యూ బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వారం రోజుల్లో జార్ఖండ్‌లో 200 మంది ఈ విష జ్వరాల బారిన పడ్డారు. వీరంతా డెంగ్యూతో బాధపడుతున్నట్లు వైద్యులు ధృవీకరించారు.
First Published:  18 Sep 2015 6:26 AM GMT
Next Story