Telugu Global
CRIME

మెట్రో రైల్లో సీటు కోసం విద్యార్థి హత్య

మెట్రో రైల్‌లో సీటు కోసం జరిగిన ఘర్షణలో ఓ విద్యార్థి కత్తిపోట్లకు గురై మరణించాడు. దేశ రాజధానిలో జరిగిన ఈ సంఘటన సంచలనం రేపింది. ఒక సీటు కోసం కొంతమంది విద్యార్ధులు రెండుగా చీలిపోయి ఘర్షణకు దిగారు. విచక్షణ కోల్పోయిన విద్యార్థులు ఇషా అనే ఓ విద్యార్థిని కత్తితో పొడిచి చంపేశారు. ఢిల్లీలోని గవర్నమెంట్‌ స్కూల్లో వీరు చదువుతున్నారు. కింగ్స్‌వే క్యాంప్‌ సమీపంలో జరిగిన ఈ సంఘటన ఢిల్లీ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది.

మెట్రో రైల్‌లో సీటు కోసం జరిగిన ఘర్షణలో ఓ విద్యార్థి కత్తిపోట్లకు గురై మరణించాడు. దేశ రాజధానిలో జరిగిన ఈ సంఘటన సంచలనం రేపింది. ఒక సీటు కోసం కొంతమంది విద్యార్ధులు రెండుగా చీలిపోయి ఘర్షణకు దిగారు. విచక్షణ కోల్పోయిన విద్యార్థులు ఇషా అనే ఓ విద్యార్థిని కత్తితో పొడిచి చంపేశారు. ఢిల్లీలోని గవర్నమెంట్‌ స్కూల్లో వీరు చదువుతున్నారు. కింగ్స్‌వే క్యాంప్‌ సమీపంలో జరిగిన ఈ సంఘటన ఢిల్లీ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది.
First Published:  17 Sep 2015 2:45 PM GMT
Next Story