Telugu Global
Others

ప్ర‌త్యేక హోదా.. కాంగ్రెస్ కోటి ఎస్ ఎం ఎస్ లు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టానికి ప్ర‌త్యేక‌హోదాపై మీన మేషాలు లెక్కిస్తోన్న టీడీపీ-బీజేపీల ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ వినూత్న కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నుంది. ఇప్ప‌టికే సీఎం చంద్ర‌బాబు, కేంద్రం పెద్ద‌ల‌పై ఏపీలోని ప‌లు పోలీస్ స్టేష‌న్ల‌లో ఫిర్యాదులు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఎస్ ఎం ఎస్‌ల రూపంలో మ‌రో నిర‌స‌న‌కు శ్రీ‌కారం చుట్ట‌నుంది. అదే  కోటి ఎస్ ఎం ఎస్‌ల ఉద్య‌మం! ప్ర‌త్యేక హోదా కోసం.. ప్ర‌య‌త్నాలు ముమ్మరం చేయాల‌ని.. సీఎం చంద్ర‌బాబు నాయుడు, రాష్ర్టం నుంచి కేంద్ర కేబినెట్‌లో ఉన్న మంత్రుల […]

ప్ర‌త్యేక హోదా.. కాంగ్రెస్ కోటి ఎస్ ఎం ఎస్ లు!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టానికి ప్ర‌త్యేక‌హోదాపై మీన మేషాలు లెక్కిస్తోన్న టీడీపీ-బీజేపీల ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ వినూత్న కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నుంది. ఇప్ప‌టికే సీఎం చంద్ర‌బాబు, కేంద్రం పెద్ద‌ల‌పై ఏపీలోని ప‌లు పోలీస్ స్టేష‌న్ల‌లో ఫిర్యాదులు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఎస్ ఎం ఎస్‌ల రూపంలో మ‌రో నిర‌స‌న‌కు శ్రీ‌కారం చుట్ట‌నుంది. అదే కోటి ఎస్ ఎం ఎస్‌ల ఉద్య‌మం! ప్ర‌త్యేక హోదా కోసం.. ప్ర‌య‌త్నాలు ముమ్మరం చేయాల‌ని.. సీఎం చంద్ర‌బాబు నాయుడు, రాష్ర్టం నుంచి కేంద్ర కేబినెట్‌లో ఉన్న మంత్రుల పోన్ల‌కు కోటి ఎస్ ఎం ఎస్‌ల‌ను పంపాల‌ని ఆ పార్టీ నిర్ణ‌యించింది. ఈ కార్య‌క్ర‌మాన్ని కాంగ్రెస్ యువ‌జ‌న విభాగం (ఎన్ ఎస్ యూ ఐ) ఆధ్వ‌ర్యంలో చేప‌ట్ట‌నున్నారు. గ‌తేడాది రాష్ర్ట‌ విభ‌జ‌న సంద‌ర్భంగా పార్ల‌మెంటులో ఏపీకి ప్ర‌త్యేక‌హోదా క‌ల్పించాల‌ని అప్ప‌టి ప్ర‌ధాని మ‌న్మోహన్ ఇచ్చిన హామీని అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ సెప్టెంబరు 23-30 వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు.
First Published:  19 Sep 2015 10:31 PM GMT
Next Story