Telugu Global
NEWS

టీఆర్‌ఎస్‌కు మావో నేత ప్రతీకార హెచ్చరిక

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) నాయకులను, మంత్రులను ఎట్టి పరిస్థితిలోను వదిలిపెట్టమని, తమ సభ్యులను అన్యాయంగా కాల్చి చంపిన రీతిలోనే ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్టు నాయకుడు సుధాకర్‌ హెచ్చరించారు. అధికారంలోకి వస్తే నక్సల్స్‌ ఎజెండా అమలు చేస్తానన్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తమ నిర్మూలనే ఏకైక లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నారని మావోయిస్టు పార్టీ ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల కార్యదర్శి దామోదర్‌ ఆరోపించారు. బూటకపు ఎన్‌కౌంటర్లో శ్రుతి, సాగర్‌లను పొట్టనపెట్టుకున్నారని, వారు మంచినీళ్ళకని దళాన్ని వదిలి బయటకు […]

టీఆర్‌ఎస్‌కు మావో నేత ప్రతీకార హెచ్చరిక
X
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) నాయకులను, మంత్రులను ఎట్టి పరిస్థితిలోను వదిలిపెట్టమని, తమ సభ్యులను అన్యాయంగా కాల్చి చంపిన రీతిలోనే ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్టు నాయకుడు సుధాకర్‌ హెచ్చరించారు. అధికారంలోకి వస్తే నక్సల్స్‌ ఎజెండా అమలు చేస్తానన్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తమ నిర్మూలనే ఏకైక లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నారని మావోయిస్టు పార్టీ ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల కార్యదర్శి దామోదర్‌ ఆరోపించారు. బూటకపు ఎన్‌కౌంటర్లో శ్రుతి, సాగర్‌లను పొట్టనపెట్టుకున్నారని, వారు మంచినీళ్ళకని దళాన్ని వదిలి బయటకు వెళ్లినప్పుడు పట్టుకుని కాల్చి చంపేశారని పేర్కొన్నారు. మీడియాకు ఓ లేఖ రాస్తూ వీరి మృతికి కారకులైన వారిని ప్రజాకోర్టులోనే శిక్షిస్తామని హెచ్చరించారు.
First Published:  21 Sep 2015 2:40 AM GMT
Next Story