మహాకవీ మన్నించు మా చంద్రబాబును..
దేశమంటే మట్టి అట ..బాబుగారి ట్వీటు వాట్ ఐయామ్ సేయింగ్… మనవాళ్లు బ్రీఫ్డ్ మీ… వంటి డైలాగులతో బాగా ప్రాచుర్యం పొందిన ఏపీ సీఎం చంద్రబాబు..తెలుగుకు కూడా తెగులు పట్టించేస్తున్నారు. మహాకవి గురజాడ దేశమంటే మట్టికాదోయ్..దేశమంటే మనుషులోయ్ అని సరికొత్త నిర్వచనం చెబితే…చంద్రబాబు దేశమంటే మట్టికదోయ్ అంటున్నారు. ఇంతలా భాషను బాబు భ్రష్టు పట్టించిన రోజు మహాకవి గురజాడ జయంతి కావడం విచారకరం. గురజాడ 153వ జయంతిని పురస్కరించుకుని..ఏపీ సీఎం చంద్రబాబు “దేశమంటే మట్టికదోయ్“ అనే కోట్ను […]
దేశమంటే మట్టి అట ..బాబుగారి ట్వీటు
వాట్ ఐయామ్ సేయింగ్… మనవాళ్లు బ్రీఫ్డ్ మీ… వంటి డైలాగులతో బాగా ప్రాచుర్యం పొందిన ఏపీ సీఎం చంద్రబాబు..తెలుగుకు కూడా తెగులు పట్టించేస్తున్నారు. మహాకవి గురజాడ దేశమంటే మట్టికాదోయ్..దేశమంటే మనుషులోయ్ అని సరికొత్త నిర్వచనం చెబితే…చంద్రబాబు దేశమంటే మట్టికదోయ్ అంటున్నారు. ఇంతలా భాషను బాబు భ్రష్టు పట్టించిన రోజు మహాకవి గురజాడ జయంతి కావడం విచారకరం. గురజాడ 153వ జయంతిని పురస్కరించుకుని..ఏపీ సీఎం చంద్రబాబు “దేశమంటే మట్టికదోయ్“ అనే కోట్ను ట్వీట్లో పెట్టారు. ఇది చూసిన భాషాభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నప్పటి నుంచి వేలాది ఎకరాల రైతుల భూములను సామదాన భేద దండోపాయాలతో బలవంతంగా ఆక్రమించుకుంటున్న ప్రభుత్వానికి దేశమంటే మట్టిలాగే కనిపిస్తుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.