Telugu Global
Others

టీడిపిలో జిల్లాకో సూదిగాడు: రోజా

ఏపీ విద్యాసంస్థ‌ల్లో వ‌రుసగా జ‌రుగుతున్న‌ విద్యార్థి మ‌ర‌ణాల‌పై వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా గ‌ళ‌మెత్తారు. ఇంత‌మంది ఆడ‌బిడ్డ‌ల మ‌ర‌ణాలు వెలుగుచూస్తున్నా సీఎం ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. ఆయ‌న‌కు ఆడ‌పిల్ల‌లు లేరు కాబ‌ట్టి, త‌ల్లిదండ్రుల ఆవేద‌న అర్థం చేసుకోలేర‌ని ఆమె విమ‌ర్శించారు. తాజాగా విజ‌య‌వాడ‌లో భానుప్రీతి అనే విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింద‌ని, ఆమె మ‌ర‌ణించిన తీరూ అనుమానాస్ప‌దంగా ఉందని అన్నారు . ఏడాది కాలంలో నారాయ‌ణ విద్యాసంస్థ‌ల్లో  11 మంది విద్యార్థినులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారని, మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు… […]

టీడిపిలో జిల్లాకో సూదిగాడు: రోజా
X
ఏపీ విద్యాసంస్థ‌ల్లో వ‌రుసగా జ‌రుగుతున్న‌ విద్యార్థి మ‌ర‌ణాల‌పై వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా గ‌ళ‌మెత్తారు. ఇంత‌మంది ఆడ‌బిడ్డ‌ల మ‌ర‌ణాలు వెలుగుచూస్తున్నా సీఎం ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. ఆయ‌న‌కు ఆడ‌పిల్ల‌లు లేరు కాబ‌ట్టి, త‌ల్లిదండ్రుల ఆవేద‌న అర్థం చేసుకోలేర‌ని ఆమె విమ‌ర్శించారు. తాజాగా విజ‌య‌వాడ‌లో భానుప్రీతి అనే విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింద‌ని, ఆమె మ‌ర‌ణించిన తీరూ అనుమానాస్ప‌దంగా ఉందని అన్నారు . ఏడాది కాలంలో నారాయ‌ణ విద్యాసంస్థ‌ల్లో 11 మంది విద్యార్థినులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారని, మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు… నారాయ‌ణ విద్యాసంస్థ‌ల అధినేత నారాయ‌ణ త‌న వియ్యంకుడు అయినందున‌ కాపాడేందుకు య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. శాసనసభలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడే మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, పీతల సుజాత తదితరులు విద్యార్ధినుల ఆత్మహత్యలపై ఎందుకు మాట్లాడడం లేదని ఆమె ప్రశ్నించారు. అలాగే తెలుగుదేశం పార్టీలో జిల్లాకో సూదిగాడు తయారయ్యాడని, అలా తయారయైన టిడిపి నేతలు సైకోలుగా మారి ప్రజలను వేధిస్తున్నారని ఆమె తీవ్రంగా విమర్శించారు. తాము చేసే విమర్శలకు సమాధానం చెప్పలేక సుదిగాళ్ల మాదిరి ఈ నాయకులు తప్పించుకొని తిరుగుతున్నారని ఆమె విమ‌ర్శించారు. త‌న‌ పాల‌న‌లో వరుస‌గా చోటు చేసుకుంటున్న విద్యార్థినుల ఆత్మహత్యలు, మ‌హిళ‌ల‌పై, మ‌హిళా అధికారుల‌పై జ‌రుగుతున్న దాడులను పట్టించుకోకుండా చంద్రబాబు సింగపూర్, తదితర దేశాలలో తిరుగుతున్నారని, ఈ దాడుల‌పై సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాలని ఆమె డిమాండ్ చేశారు.

First Published:  23 Sep 2015 12:12 AM GMT
Next Story