రజనీకాంత్ ఆధ్యాత్మిక గురువు కన్నుముశారు..!
స్వామి దయానంద గిరి కన్నుమూశారు. రిషికేశ్లోని ఆశ్రమంలో ఆయన తుదిశ్వాస విడిచారు. దయానంద గిరి ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రి నుంచి ఆశ్రమానికి తరలించారు. ఈ సందర్బంగా రజనీకి సన్నిహితులైన దయానంద గిరి గురించి సంతాపం తెలియచేస్తూ ట్వీట్ చేసారు. గత కొంత కాలంగా స్వామి దయానంద గిరి అనారోగ్యంతో బాధ పడుతున్నారు. గత పది రోజులుగా జాలిగ్రాండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఆయన ఆరోగ్యం విషమించడంతో.. హస్పటల్ నుంచి.. ఆయన ఆశ్రమానికి తరలించారు. తీవ్ర అస్వస్థతో […]
BY admin24 Sep 2015 2:42 AM GMT
X
admin Updated On: 24 Sep 2015 2:42 AM GMT
స్వామి దయానంద గిరి కన్నుమూశారు. రిషికేశ్లోని ఆశ్రమంలో ఆయన తుదిశ్వాస విడిచారు. దయానంద గిరి ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రి నుంచి ఆశ్రమానికి తరలించారు. ఈ సందర్బంగా రజనీకి సన్నిహితులైన దయానంద గిరి గురించి సంతాపం తెలియచేస్తూ ట్వీట్ చేసారు. గత కొంత కాలంగా స్వామి దయానంద గిరి అనారోగ్యంతో బాధ పడుతున్నారు. గత పది రోజులుగా జాలిగ్రాండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఆయన ఆరోగ్యం విషమించడంతో.. హస్పటల్ నుంచి.. ఆయన ఆశ్రమానికి తరలించారు. తీవ్ర అస్వస్థతో ఆయన బుధవారం పరమ పదించారు.
ఇటీవలే దయానంద గిరిని ప్రధాని మోదీ కలిశారు. దయానంద మృతి పట్ల వివిధ రంగాల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాగా, గురువు తుదిశ్వాస విడిచిన విషయాన్ని తెలుసుకున్న మోడీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన లేకపోవడం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన ఆలోచనలు అనేకమంది ప్రజల్లో స్ఫూర్తి నింపాయని అన్నారు
Next Story