Telugu Global
CRIME

వ్యాపంపై సీబీఐ సోదాలు

వ్యాపం కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లోని సుమారు 40 ప్రదేశాల్లో సోదాలు జరిపింది. ఇందులో భాగంగా ఈ కుంభకోణానికి సూత్రధారి అయిన జగదీశ్ సాగర్, మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్‌నరేశ్ యాదవ్ మాజీ ఓఎస్డీ ధన్‌రాజ్ యాదవ్‌ల నివాసాల్లో కూడా సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. వీరితోపాటు మధ్యప్రదేశ్ మాజీ మంత్రి లక్ష్మీకాంత్ శర్మ, ఇతర అనుమానితులు భరత్ మిశ్రా, వినోద్ భండారీ, సుధీర్‌శర్మ, ఓంప్రకాశ్ శర్మ, నితిన్ మహీంద్రల నివాసాల్లోనూ సీబీఐ సోదాలు […]

వ్యాపం కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లోని సుమారు 40 ప్రదేశాల్లో సోదాలు జరిపింది. ఇందులో భాగంగా ఈ కుంభకోణానికి సూత్రధారి అయిన జగదీశ్ సాగర్, మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్‌నరేశ్ యాదవ్ మాజీ ఓఎస్డీ ధన్‌రాజ్ యాదవ్‌ల నివాసాల్లో కూడా సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. వీరితోపాటు మధ్యప్రదేశ్ మాజీ మంత్రి లక్ష్మీకాంత్ శర్మ, ఇతర అనుమానితులు భరత్ మిశ్రా, వినోద్ భండారీ, సుధీర్‌శర్మ, ఓంప్రకాశ్ శర్మ, నితిన్ మహీంద్రల నివాసాల్లోనూ సీబీఐ సోదాలు జరిపింది. మధ్యప్రదేశ్ వృత్తి విద్యా బోర్డులోనూ తనిఖీలు నిర్వహించింది.
First Published:  24 Sep 2015 3:03 PM GMT
Next Story