Telugu Global
Cinema & Entertainment

నాగశౌర్య-నిహారిక ఫిక్స్ అయ్యారు

నాగబాబు తనయ నిహారిక వెండితెర ఎంట్రీకి రంగం సిద్ధం అయింది. ప్రముఖ ఛానెల్ టీవీ9, మధుర శ్రీధర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తారు. మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు సినిమా తీసిన రామరాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. నిజానికి ఈ సినిమాలో మొదట జ్యోతిలక్ష్మిలో నటించిన సత్యను హీరోగా అనుకున్నారు. కానీ స్వయంగా నాగశౌర్య మేకర్స్ వద్దకెళ్లి.. ఈ సినిమా చేస్తానని రిక్వెస్ట్ చేయడంతో నిర్మాతలు ఒప్పుకున్నారు. పైగా నాగబాబు కూతురు నిహారిక నటిస్తున్న మొట్టమొదటి సినిమా […]

నాగశౌర్య-నిహారిక ఫిక్స్ అయ్యారు
X
నాగబాబు తనయ నిహారిక వెండితెర ఎంట్రీకి రంగం సిద్ధం అయింది. ప్రముఖ ఛానెల్ టీవీ9, మధుర శ్రీధర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తారు. మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు సినిమా తీసిన రామరాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. నిజానికి ఈ సినిమాలో మొదట జ్యోతిలక్ష్మిలో నటించిన సత్యను హీరోగా అనుకున్నారు. కానీ స్వయంగా నాగశౌర్య మేకర్స్ వద్దకెళ్లి.. ఈ సినిమా చేస్తానని రిక్వెస్ట్ చేయడంతో నిర్మాతలు ఒప్పుకున్నారు. పైగా నాగబాబు కూతురు నిహారిక నటిస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అందరికీ అంచనాలు పెరిగాయి. అభినయ్, కృష్ణభట్ల ఈ ప్రాజెక్ట్ కు సహ-నిర్మాతలుగా వ్యవహరిస్తారు. ఈ సినిమా ఓపెనింగ్ ను గ్రాండ్ గా చేయాలని ఇప్పటికే ఫిక్స్ అయ్యారు నాగబాబు. మెగాహీరోల రాకతో ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని నిర్వహించాలనుకుంటున్నారు. ఇప్పటికే బుల్లితెరపై, షార్ట్ ఫిలిమ్స్ తో ఆకట్టుకున్న నిహారిక,.. వెండితెరపై ఏ రేంజ్ లో రాణిస్తుందో చూడాలి.
First Published:  24 Sep 2015 7:03 PM GMT
Next Story